News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)AP
Exice Act నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో S.I K.P. ప్రహల్లాద మరియు సిబ్బంది H.C మద్దిలేటి,PC’c మధు నాగరాజు రంగస్వామి పాల్గొన్నారు.
News
ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన రాజకీయ ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహిస్తున్న ప్రజలకోసం మీ పార్థసారథి కార్యక్రమంలో ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. గత ప్రభుత్వ పథకం పేరును ఎమ్మెల్యే ప్రస్తావించడం.. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది.
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ప్రజల కోసం మీ పార్థసారథి పేరుతో స్థానికంగా తిరుగుతూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. అయితే, ఈ పర్యటనలో భాగంగా ఒక మహిళ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి.. తనకు గత వైసిపి ప్రభుత్వ హయాంలో రావాల్సిన ‘అమ్మ ఒడి’ పథకం రాలేదంటూ తన బాధను చెప్పుకుంది. మహిళ సమస్య విన్న ఎమ్మెల్యే పార్థసారథి.. స్పందిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం ‘తల్లికి వందనం’ పేరును ప్రస్తావించాల్సింది పోయి.. యథాలాపంగా జగన్ ప్రభుత్వ కాలం నాటి ‘అమ్మ ఒడి’ అనే పదాన్నే వాడేశారు. ఎమ్మెల్యే నోట ‘అమ్మ ఒడి’ అనే మాట రావడాన్ని గమనించిన పక్కనే ఉన్న కూటమి నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఎమ్మెల్యే గారికి దగ్గరగా జరిగి.. “అది అమ్మ ఒడి కాదు సార్.. తల్లికి వందనం అని చెప్పండి” అంటూ మెల్లగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పక్కనున్న నాయకులు సరిచేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే పార్థసారథి ఏమాత్రం తగ్గకుండా కాస్త ఎటకారంగా సమాధానమిచ్చారు.

“ఆ పేరు (తల్లికి వందనం) ఇంకా ప్రజలకు తెలీదు.. అది ఇంకా అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు” అంటూ వ్యాఖ్యానించారు. సొంత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై.. కూటమి ఎమ్మెల్యేనే ఇలా ఓపెన్గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆదోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
News
ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
కర్నూలు జిల్లా ఆదోని నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనాంశాలపై కలెక్టర్ సిరి నూతన ఆర్డీవోకు పలు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.


News
వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు.. కరీంనగర్లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్లైన్ బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు..
లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేసిన నిందితుడు. ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి, పని ఇప్పిస్తానని చెప్పి, నసుల్తాపూర్ శివారులోని తీసుకెళ్లి అర తులం బంగారం, 20 గ్రాముల వెండి కాజేసి వృద్ధురాలిని బావిలో తోసేసి వెళ్ళిపోయిన దినేష్ రెడ్డి..
దాదాపు 21 గంటలు బావిలో ఉన్న అనంతరం, మరుసటి రోజు ఉదయం లక్ష్మిని గ్రామస్థులు బావి నుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిరు. సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. నిందితుడిని దినేష్ రెడ్డిని విచారించగా బంగారాన్ని టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి విక్రయించి రూ.30 వేలు తీసుకున్న నిందితుడు తెలిపాడు. నిందితుడితో పాటు బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

-
News2 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News3 hours agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News2 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News3 days agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News2 weeks agoఅదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం
