News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)AP
Exice Act నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో S.I K.P. ప్రహల్లాద మరియు సిబ్బంది H.C మద్దిలేటి,PC’c మధు నాగరాజు రంగస్వామి పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

News
మహిళా భద్రతపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఆదోని డిఎస్పి శ్రీ హేమలత ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు.

అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఆపద సమయంలో భయపడకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సదస్సులో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు..

- డైల్ 112 (Dial 112): అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ‘డైల్ 112’ నంబర్ను ఎలా సంప్రదించాలో వివరించారు.
- సైబర్ క్రైమ్: సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
- రోడ్డు భద్రత: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు మితిమీరిన వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
News2 days agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News4 days agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News3 days agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 days agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News4 weeks agoఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
-
News2 days agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News2 days agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
