Connect with us

News

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

Published

on

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)AP
Exice Act నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో S.I K.P. ప్రహల్లాద మరియు సిబ్బంది H.C మద్దిలేటి,PC’c మధు నాగరాజు రంగస్వామి పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 11.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 11 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1626.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 82.599 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 41167 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 39569 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1630 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 86.894 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

పార్థసారథి పై రైతు సంఘం నేతల ఘాటు వ్యాఖ్యలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల ఆందోళన

Published

on

కేంద్ర కార్మిక సంఘాలు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా “జైల్ భరో” నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలసికట్టుగా ఈ ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్మిక సంఘాలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రధాన రహదారుల గుండా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు ఎటువంటి సుంకం లేకుండా దిగుమతి అయి, దేశీయంగా పంటల ధరలు పడిపోతున్నాయని.. ◆ అదే సమయంలో మన ఉత్పత్తుల ఎగుమతులపై 25% సుంకం విధించడంతో తీవ్ర నష్టం జరుగుతోందని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ◆ ఢిల్లీ రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రతీ రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ◆ కార్పొరేట్ సంస్థల కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, రైతులపై కనికరం చూపకపోవడం దారుణమన్నారు. ◆ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ◆ ‘విబిసి రామ్‌జీ’ చట్టంతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి దూరం చేస్తున్నారని విమర్శించారు.

పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులు

◆ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు తాండవిస్తోందని, తుంగభద్ర నీరు సముద్రంపాలవుతున్నా శ్రీశైలం-హోస్పేట్ మధ్య కనీసం ఒక్క డ్యామ్ కూడా నిర్మించకపోవడం శోచనీయమన్నారు. ఆలూరు, ఆదోని ప్రాంతాలకు నీరందించే వేదవతి, గుండ్రేవుల, RDS ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఆదోని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రజలు చెంబులు-బిందెలతో నిరసన తెలుపుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ◆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మెడికల్ కాలేజీ, ఆటో గ్యారేజ్, మాస్టర్ ప్లాన్ అమలును వెంటనే పూర్తి చేయాలని, చిల్లర రాజకీయాను మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్షాలు

​ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా కంటితుడుపు రాజకీయం మాని, రైతులు, కార్మికులు మరియు ఆదోని ప్రాంత అభివృద్ధి సమస్యలపై తక్షణమే స్పందించాలని.. లేనిపక్షంలో పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డా పార్థసారథి పై రైతు సంఘం నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే డా.పార్థసారథి చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. వైసిపి నేతలు మూడు రోజులు దీక్ష చేసిన శిబిరాల వద్ద వెళ్ళి ఎమ్మెల్యే వివరణ చేయాలి కాని అధికార పార్టీలో ఉండి ప్రతి పక్ష పార్టీ ఆఫీస్ ను ముట్టడి చేస్తామనడం సిగ్గు చేటుఅని వెంకటేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. అభివృధి మానేసే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డా.పార్థసారథి అని  రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపించారు.

Continue Reading

Trending