ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ‘కోడ్ అమల్లోకి వస్తే పోటీలో ఉండే అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు రూ.50వేలకు మించి నగదు, రూ. 10వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయకూడదు. స్టార్ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లకూడదు. పరిమితికి మించితే నగదు, వాహనాలు సీజ్ చేస్తాం’ అని వెల్లడించారు.
రాష్ట్రంలో తొలిసారిగా ఆదోని ఆర్ట్స్ కాలేజ్ లో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ శిక్షణ
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రత్యేక శిక్షణ. భారతదేశంలోని చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి మరియు టెంప్లేట్ మాన్స్టర్ మరియు వెబ్లియం వంటి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామిగా ఉన్న టెక్-మార్క్ చొరవలో భాగంగా, మేము అదోని ఆర్ట్స్తో దీర్ఘకాలిక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. & సైన్సెస్ కళాశాల. ఈ భాగస్వామ్యం కళాశాలలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత కేంద్రాలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ […]
ఆలూరు రాజకీయాల్లో మారుతున్న ముఖచిత్రం
ఆలూరు ప్రత్యేక ప్రతినిధి : కర్నూలు జిల్లా ఆలూరు నియోజక వర్గంలో వైకాపాలో ఆసక్తికర రాజకీయ చదరంగాలు బయట పడుతున్నాయి… దశాబ్దకాలంగా ఎదురుచూపులు చూస్తున్న తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ జెండా మోసినా జరగని న్యాయం అని ఆయన వర్గీయులు మదనపడుతున్నారు, ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తోన్న ప్రత్యర్థులను జయించి ఈ సరైన 2024 ఎన్నికల్లో ఆలూరు టికెట్ సురేందర్ రెడ్డికి దక్కేనా.. ? అని నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంట్ […]
ఆదోనిలో చదివే అమ్మాయికి అమెరికాకు వెళ్లే ఛాన్స్
కర్నూలు జిల్లా ఆదోని కస్తూరిబా స్కూల్లో చదువుకున్న విద్యార్థిని శివలింగమ్మ 10వ తరగతిలో 541 మార్కులతో పాస్ అయినందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంన్న శివలింగమ్మ శనివారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం పొంది తనకు ఈ అవకాశం వచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపింది.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సోమనాథ్ గంగమ్మ నాలుగో సంతానం శివలింగమ్మ అమెరికా వెళ్లి […]
కర్ణాటక మద్యం తరలించే వారిపై ఉక్కు పాదం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం డంప్ యార్డ్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం ఆదోని పట్టణానికి చెందిన బోయ సూర్య, బోయ నీలకంఠ, దుబ్బ నరసింహులు ఒక మోటారు సైకిలు మీద 18 కర్ణాటక మద్యం బాక్సులు రవాణా చేస్తుండగా గుర్తించి […]
ఆదోని సేబ్ స్టేషన్లో వాహనాల వేలం
నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రూ. 4,24,000/- కాగా వేలం పాటలో రూ.6,29,000/- మరియు GST రూపంలో మరో రూ 1,13,220/- అనగా మొత్తం రూ. 7,42,220/- ఆదాయం వచ్చినది అని సెబ్ అధికారులు తెలిపారు.
ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను […]
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల20 వేలు ఆర్థిక సహాయం
ఆరోగ్యశ్రీలో లేక వైద్యం కోసం ఖర్చుపెట్టి ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారుకర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల 20 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు. కార్వాన్ పేట్ వీధి కి చెందిన నరసింహులు 4 లక్షల […]
ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు
ఆదోని త్రీటౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన పి. నరసింహ రాజు. ఆదోని త్రీటౌన్ సిఐగా విధులు నిర్వహిస్తున్న సీఐ శ్రీరాములు కర్నూలు విఆర్బదిలీ చేసినట్లు శుక్రవారం ఉత్తర్వులు .పి నరసింహ రాజు సీఐగా బాధ్యతలు స్వీకరించారు.
ఆరెకల్ గ్రామానికి చెందిన జయంమ్మకు 5 లక్షల వైఎస్ఆర్ బీమా అందించిన ఎమ్మెల్యే
ఆదోని మండలం అరేకల్ గ్రామానికి చెందిన యోహాను అనే వ్యక్తి ప్రమాద వశాత్తు మృతిచెందిన కుటుంబానికి భార్య జయమ్మ కు వైయస్సార్ భీమా పథకంలో ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అందజేశారు.వివరాల్లోకెళ్తే ఆరెకల్ గ్రామానికి చెందిన యోహోను జనవరి రోజు బాణాలు సంచారాలు కలుస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలు కావడంతో కర్నూల్ లో చికిత్స పొందు తూ 8వ తేదీ మృతి చెందినాడు అతనికి భార్య జయమ్మ ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. […]