కర్నూలు జిల్లా ఆదోని మండలం నగరూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని సుమారు 30 సంవత్సరముల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది అని ఆదోని రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు తీవ్రగాయాలతో అక్కడక్కడే మృతి చెందింది. మృతురాలు లైట్ రెడ్ రంగు గల లెగ్గిన్, గులాబి రంగు గల టాప్ కు బ్లూ రంగు డాట్స్, బార్డర్ ఉన్న టాప్ ధరించి వున్నది.ఆచూకీ తెలిసినవారు RPSI గోపాల్ ఆదోని ఫోన్ 9849157634 […]
ఆదోని అభివృద్ధివైపు అడుగులు
వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి, ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.కర్నూలు జిల్లా అదోనిలో మంగళవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధ్యక్షతన డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ […]
స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి సబ్ కలెక్టర్ కు వినతి.. DSF
కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయకుండా ప్రభుత్వ నిబంధనలును ఉల్లంఘిస్తున్నారు అందువల్ల స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ ధనాపురం గ్రామం లో గౌరీ గణేష్ ఇంగ్లీష్ స్కూల్ బయట బహిరంగంగా […]
మీ IRCTC ఐడీపై ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు, 10 వేలు జరిమాన.
రైలు రిజర్వేషన్లపై అమలులోకి వచ్చిన కొత్త రూల్స్. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ IRCTC అకౌంట్లో టికెట్ బుక్ చేస్తే మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకే చేయాలి. వేరే వ్యక్తులకు చేస్తే రూ.10వేల ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా రెండూ విధిస్తారు.
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 25.06.2024
కుప్పంలో 2 రోజుల సీఎం పర్యటన షెడ్యూల్
నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్.మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్లనున్న సీఎం..హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు..మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ..సాయంత్రం ఆర్ అండ్ బీ భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం.. రేపు బుధవారం కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద వినతుల స్వీకరణ..మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సీఎం సమీక్ష..మధ్యాహ్నం […]
రాంగ్ పార్కింగ్, రికార్డ్స్, డి.ఎల్ లేని 38 వాహనాలకు జరిమాన
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ మరియు ఆదోని డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణ పరిసరాలలో ప్రమాదాలు నివారించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ లో రాంగ్ పార్కింగ్, రికార్డ్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని 38 వాహనాలకు Rs.10,930/- జరిమానా విధించారు, 9 వాహనాలను ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి రాసి పంపినట్లు అదేవిధంగా డ్రంకన్ & డ్రైవ్ […]
40 సం. గా ఉన్నాము పొజిషన్ సర్టిఫికెట్ ఇవండి.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను […]
పేపర్ లీకేజీ స్కాంలలో ఇంకెంత మంది విద్యార్థులు బలైపోవాలి? పిడిఎస్ఓ
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ – 2024 పరీక్ష నిర్వహణలో జరిగిన స్కాంలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయుటకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పిడిఎస్ఓ) ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ పరీక్షకు ఒకరోజు […]
విద్యాధికారులు కుర్చీలకే పరిమితమయ్యారా? DSF
ఆదోని పట్టణంలో SC BC సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి హాస్టల్ సీటు ఇవ్వాలని DSF ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్స్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం […]