Author: Shamsheer khan

ముఖ్యమంత్రి పర్యటన జూన్ ఒకటవ తేదీకి మార్పు.. జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 వ తేదీన ఉన్న కర్నూలు జిల్లా పత్తికొండ లో పర్యటన కార్యక్రమం వచ్చే జూన్ ఒకటవ తేదీకి మార్పు అయినట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటన లో తెలిపారు.. అనివార్య కారణాల వల్ల ఈ మార్పు జరిగిందని, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఈ నెల 30 వ తేదీన కాకుండా వచ్చే జూన్ నెల ఒకటవ తేదీన ఉంటుందని కలెక్టర్ ఈ ప్రకటన లో […]

ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా 2,30,000 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కను బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న బి.భీమా లింగప్ప బాధితుల కుటుంబంకు అందజేశారు. బాధ్యత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తామన్నారు.

కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు కర్ణాటక మధ్య 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. సిఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు తమకు సమాచారం రావడంతో […]

కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిపై సెబ్ అధికారుల ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మదిరే క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా కర్ణ కర్ణాటక మద్యం తరలిస్తున్న పర్వతాపురం గ్రామానికి చెందిన P. మస్తాన్ సాబ్ అనే వ్యక్తిని సెబ్ అధికారు అరెస్టు చేసి అతని వద్ద నుండి మోపెడ్ స్కూటర్ 2 కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు, ఈ దాడులలో సేబ్ ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, SI లు శివ ప్రసాద్, మధు సుడన రెడ్డి, PC సోమేశ్ సిబ్బంది […]

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన […]

పతనం అవుతున్న పత్తి ధర ఆందోళన చెందుతున్న రైతులు

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది 25వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 6681 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4287 రూపాయలకు పలికింది. పతనమవుతున్న పతి ధరను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (25 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 6767-00మధ్యధర ₹ 6404-00కనిష్టం   ₹ 500-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం   ₹ 6556-00మధ్యధర ₹ […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు 27.05.2023

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61800-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 5727-00వెండి 10 గ్రాములు సుమారు ₹ 727-00

ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం వాలంటీర్లదె

నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచేసి సంక్షేమ పథకాలను పేదలకు అందజేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లకు సూచించారు.కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసుదన్ చేతుల మీదుగా సచివాలయ వాలంటిర్ లకు ముగ్గురికి సేవా వజ్ర, ఆరు మందికి సేవా రత్న, 656 మందికి సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఎంపీ, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులకు సేవ […]

ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల […]

ఆటో అడ్డు రావడంతో లారీ అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ రోడ్డు బాట మారెమ్మ గుడి సమీపంలో ఉల్లిగడ్డల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ ఇచ్చిన వివరాల మేరకు గుల్బర్గా నుంచి ఉల్లిగడ్డలు వేసుకొని వెళ్తుండగా ఆటో సడన్గా అడ్డం రావడంతో అదుపుతప్పి టైర్ పగిలి కింద పడిందని అయితే డ్రైవర్కి, క్లీనర్కి ఎటువంటి గాయాలు కాలేదు అని తెలిపారు.

Back To Top