Connect with us

News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే హక్కు రాష్ట్రపతికే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిజెపి నియంత ప్రభుత్వ వైఖరికి గిరిజన సంఘాలు మొత్తం ఏక కంఠంతో ఖండిస్తున్నాం అని అన్నారు. గిరిజన ప్రజానీకానికి ఈ దేశంలో అత్యున్నత స్థానం కల్పించేలా చేసిందని బిజెపి సంకలు గుద్దుకుండంతో నేడు అదే గిరిజన మహిళలకు నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం గోరమైన అవమానం అని నిప్పులు చెరిగారు. రాజకీయపరంగా గిరిజనులను బిజెపి ప్రభుత్వం అవసరానికి వాడుకుంటున్నాయని అనడంలో తేటతెల్లం అయిందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు మారుతి రావు, హనుమేష్, రామకృష్ణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రై మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్
సెంట్రల్  స్కీం  ద్వారా 63 లక్షలతో ZP పాఠాశాల అదనపు గదులకు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా 10 లక్షలతో గ్రామములో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

తాపీ చేతబట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

         ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామంలోనే కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో స్కూలకు అదనపు గదులకు పనులు త్వరలో చేపడతామని స్కూళ్లలో విద్యార్థుల అధికంగా ఉండడంతో టీచర్లు లేరని దానికోసం ప్రభుత్వంతో మాట్లాడి విద్య వాలంటీర్లు టీచర్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

గడ్డపార చేతబట్టి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
Continue Reading

News

హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన గ్రామంలో కర్ణాటక నుంచి హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకొని 50 సిలిండర్లను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పోలీసులకు డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.

Continue Reading

News

నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు

Published

on

◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..
◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ. 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..
◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో ఇచ్చిన డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్.. క్యాబినెట్లో 42 శాతం పదవులు బీసీలకే ఇవ్వాలన్న హరీష్ రావు..
◆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.. ఏపీ అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదన్న నేతలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు దృష్టిసాదించాలని డిమాండ్..
◆ రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ, స్వారీ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో రాలేనని అధికారులకు సమాచారం. ఎనిమిది వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడి కి తెలిపిన ఆర్జీవి..
◆ సంగారెడ్డి జిల్లా ముద్దాయి పేటలో చెరుకు తోట దగ్ధం, 14 ఎకరాల్లో పంట సాగు చేస్తున్న రైతుకు తీవ్ర నష్టం. ఎనిమిది లక్షలు నష్టం జరిగిందని లింగయ్య తీవ్ర ఆవేదన..
◆ మణిపూర్ సీఎం బిరేంద్ర సింగ్ రాజీనామా, గవర్నర్కు రాజీరామా లేఖ అందజేత, బీరన్ సింగ్ పై అవిశ్వాసం పెట్టినందుకు సిద్ధమైన కాంగ్రెస్, తాజా రాజకీయాల పరిణామంతో సీఎం పదవికి రిజైన్..
◆ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు.. దేశ రక్షణ కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు.. వైనాడ్ నియోజకవర్గం లో బూత్ స్థాయి నేతలతో ప్రియాంక భేటీ..
◆ ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన పై కొనసాగుతున్న నిరసనలు.. పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన జూనియర్ డాక్టర్లు.. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్..
◆ తమిళనాడులోని తిరుచిలో అలరిస్తున్న బర్డ్ పార్క్ సందర్భంగా అలరిస్తున్న ఆస్టిన్ కోళ్లు కొంగలు

Continue Reading

Trending