Connect with us

News

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు

Published

on

అమరావతి. తేదీ 12.06.2024 ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామము వద్ద వున్న మేధా టవర్స్ ఐ.టి. పార్క్ ప్రదేశంలో జరుపుటకు నిర్ణయించినారు. ఈ కార్యక్రమానికి పలువురు VVIPలు , గవర్నర్, ముఖ్య నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనె అవకాశము ఉన్నందున. విజయవాడ నగరము నుండి గన్నవరం వైపుకు వెళ్ళు పలు వాహనముల రాకపోకలకు అసౌకర్యము కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ని మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

■ విజయవాడ నగరము లోని సాధారణ వాహనములు మళ్ళింపులు

★ విజయవాడ నుండి ఏలూరు మరియు విశాఖపట్నం వైపుకు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనములు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిలు నుండి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపుకు పంపబడును.

■ వియవాడ వెలుపల ట్రాన్స్ పోర్టు వాహనములు మళ్ళింపులు

★ విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు వచ్చు వాహనములు: హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం ఇరువైపుల

■ విశాఖపట్నం నుండి చెన్నై వైపుకు వచ్చు వాహనములు

★ హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ , పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు.

■ చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు వచ్చు వాహనములు

★ ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్

■ చెన్నై నుండి హైదరాబాద్ వైపుకు వెళ్ళు వాహనములు

★మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడెం, నల్గొండ నుండి వెళ్ళవలయును

■ హైదరాబాద్ నుండి గుంటూరు వైపుకు వచ్చు వాహనములు

★నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ళ, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుండి వెళ్ళవలయును

■ RTC బస్సులు మళ్ళింపులు

■ విజయవాడ ఏలూరు వైపుకు వెళ్ళు బస్సులు

★PNBS నుండి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంటగుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపుకు వెళ్ళ వలెను.

విజయవాడ రామవరప్పాడు రింగ్ నుండి గన్నవరం వైపుకు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమమునకు వెళ్ళు వాహనములు మరియు అంబుల్లన్స్ , అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనములు తప్ప మరి ఏ ఇతరవాహనములు గన్నవరం వైపుకు అనుమతించబడవు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించబడతాయి. కావున 12.06.2024 “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ప్రమాణ స్వీకారోత్సవం” కార్యక్రమం సందర్భముగా ట్రాఫిక్ అవాంతరాలు, ప్రజలకు ఇబ్బందులు సాధ్యమైనంత కనీస స్థాయిలో ఉండేందుకుగాను చేపట్టిన ట్రాఫిక్ మళ్ళిoపు చర్యలను నగర ప్రజలందరు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending