News
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించరు. బండిమెట్ట అంగన్వాడి సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ లో ఉన్న దానికంటే స్టాక్ ఎక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ కు మేము జారీ చేసి చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఆదేశించారు. అనంతరం. ఆరెకల్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో చాలా బాగా చదువుతున్నారని వారికి ప్రోత్సాహకర అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి 2000 రూపాయల వాచ్ కొనివ్వలని ప్రిన్సిపల్ కు 2000 అందించారు. విరుపాపురం గ్రామంలో zphs స్కూల్ ఆహారం రుచిగా లేదంటు విద్యార్థు ఫిర్యాదు చేశారు. ఆహారాన్ని రుచి చూసి సరిగ్గ లేదని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల వరకు అనుమతిస్తున్నానని అంతలోపు మార్పు రాకపోతే అందర్నీ తొలగించి కొత్తవారిని తీసుకుంటామని హెచ్చరించారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




