News
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి- నూర్ అహ్మద్
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం మరింత విస్మయం కలిగించే విషయం అన్నారు. కావున మన అన్నదాతలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కొన్ని కఠిన చట్టాలను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదోని జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారు ప్రత్యక్షంగా రైతుల ఆత్మహత్యలకు, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి కారకులు అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన పంటలు కొరత ఏర్పడుటకు కారణమౌతున్నారు. దేశాభివృద్ధి కుంటుపడటంలో పరోక్ష పాత్ర వహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని కావున నకిలీ విత్తనాలు తయారీదారులు,అమ్మకందారులను ఉరిశిక్ష విధించే చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసి అమలు చేయాలి అని నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారి ఆస్తులను జప్తు చేసి వాటిని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని భవిష్యత్తులో నకిలీ విత్తనాలు తయారు చేయాలి, అమ్మాలి ఆలోచన వస్తే వెన్నులో వణుకుపుట్టాలి ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా వీరిని కాపాడేందుకు రాజకీయ నాయకులు గాని ఇతరులు గాని ముందుకు రావటం సిగ్గు చేటు, వీరు రైతు ద్రోహులు. కావున సందట్లో సడేమియాలా బ్రోకర్లలా మధ్యలో దూరి నకిలీ విత్తనాల ద్రోహులను కాపాడేవారు మారాలని లేని పక్షంలో వారు భవిష్యత్తులో నీఛులుగా గుర్తింపబడతారు అని తెలిపారు. మనుషులు, చట్టాలు శిక్షించకున్నా దేవుని శిక్షకు వీరు గురికాక తప్పదని హెచ్చరిచారు.
కావున రైతులు ఉసురు పోసుకోవద్దని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.నూర్ అహ్మద్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సమితి రూరల్ నాయకులు పి.వి. కుబేర స్వామి పాల్గొన్నారు.
News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News2 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 week agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News2 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
