News
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి- నూర్ అహ్మద్
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం మరింత విస్మయం కలిగించే విషయం అన్నారు. కావున మన అన్నదాతలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కొన్ని కఠిన చట్టాలను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదోని జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారు ప్రత్యక్షంగా రైతుల ఆత్మహత్యలకు, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి కారకులు అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన పంటలు కొరత ఏర్పడుటకు కారణమౌతున్నారు. దేశాభివృద్ధి కుంటుపడటంలో పరోక్ష పాత్ర వహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని కావున నకిలీ విత్తనాలు తయారీదారులు,అమ్మకందారులను ఉరిశిక్ష విధించే చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసి అమలు చేయాలి అని నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారి ఆస్తులను జప్తు చేసి వాటిని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని భవిష్యత్తులో నకిలీ విత్తనాలు తయారు చేయాలి, అమ్మాలి ఆలోచన వస్తే వెన్నులో వణుకుపుట్టాలి ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా వీరిని కాపాడేందుకు రాజకీయ నాయకులు గాని ఇతరులు గాని ముందుకు రావటం సిగ్గు చేటు, వీరు రైతు ద్రోహులు. కావున సందట్లో సడేమియాలా బ్రోకర్లలా మధ్యలో దూరి నకిలీ విత్తనాల ద్రోహులను కాపాడేవారు మారాలని లేని పక్షంలో వారు భవిష్యత్తులో నీఛులుగా గుర్తింపబడతారు అని తెలిపారు. మనుషులు, చట్టాలు శిక్షించకున్నా దేవుని శిక్షకు వీరు గురికాక తప్పదని హెచ్చరిచారు.
కావున రైతులు ఉసురు పోసుకోవద్దని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.నూర్ అహ్మద్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సమితి రూరల్ నాయకులు పి.వి. కుబేర స్వామి పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
