Connect with us

News

కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న

Published

on

కర్నూలు జిల్లా: కర్నూల్ రేంజ్, ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఎసిబి నూతన డిఎస్పీగా దివిటి సోమన్న 30 04 2025 వతేది బాధ్యతలు స్వీకరించరు. ఎసిబి డిఎస్పీ సోమన్న
ఎసిబి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.  శ్దివిటి సోమన్న  స్వగ్రామం వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. 1991 లో ఎస్‌ఐ హోదాలో  పోలీసు డిపార్ట్మెంట్ లో  విధుల్లో నిర్వహించారు.
ఎస్‌ఐ గా క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, పి‌టి‌సి అనంతపురం నందు ప్రమోషన్ పొందిన తరువాత సి‌ఐ గా సి‌ఐడిలో, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లిలో పని చేసినారు. 2020 లో  డి‌ఎస్‌పిగా పదోన్నతి పొంది సి‌ఐడి శాఖలో మరియు ఆదోని సబ్ డివిజన్ లో పని చేశారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరియు పార్టీ నాయకులు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాల్గవ తేదీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకుల పై సోషల్ మీడియా పై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటినుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ గత వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు
విలేకరుల తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

విద్యార్థుల ఆట స్థలాలను కాపాడండి DSF, NSUI

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆట స్థలంలో పశువుల హాస్పిటల్  భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ DSF, NSUI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, NSUI ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో విద్యార్థుల ఆటస్థలం ( గ్రౌండ్)లో నుంచి పొలాలకు, ఇండ్లకు వెళ్లే రోడ్డు గా మార్చేశారని అంతటితో ఆగకుండా ఆట స్థలంలో వాటర్ ట్యాంక్, షాపుల కోసం చాలా స్థలము ఆక్రమించారని విద్యార్థి సంఘం బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశువుల హాస్పిటల్ కోసం భవన నిర్మాణం చేపడుతున్నారని ఇలా కట్టుకుంటూ వెళ్తే విద్యార్థులకు ఆట స్థలం ఎక్కడ మిగులుతుందని భవిష్యత్తులో భావితరాల విద్యార్థులకు ఆట స్థలం మిగలదని విద్యార్థి సంఘం నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దాదాపుగా 1100 మంది విద్యార్థులు చదువుతున్నరని జూన్ 12 నాటికి పాఠశాలలు ఓపెన్ అయితే విద్యార్థులు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 01 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

01 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement
Continue Reading
News2 days ago

కౌతాళం మండలం లో దారుణం

News1 day ago

క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

News3 weeks ago

భారత్‌-పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన

News2 weeks ago

ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

News3 weeks ago

వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

News3 weeks ago

శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని  సిపిఎం పార్టీ పాదయాత్ర

News8 hours ago

వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

News3 weeks ago

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్

News6 days ago

ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు

Business1 week ago

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

Trending