News
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.
News
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


News
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ.

ఆదోని 19 05 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు


News
ఆదోని డివిజన్లో వర్షపాతం నమోదు..

ఆదోని డివిజన్లో శనివారం 17 వ తేది కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించిన అధికారులు
హోళగుంద – 64.2 m.m
ఎమ్మిగనూరు- 28.4 m.m
కౌతాళం – 22.0 m.m
పెద్దకడబూరు – 17.6 m.m
ఆదోని – 15.2 m.m
కోసిగి- 14.4 m.m
గోనెగండ్ల- 12.4 m.m
నందవరం – 3.8 m.m
మంత్రాలయం – 0.0 m.m
మొత్తం వర్షపాతం – 178.0 m. m
సుమారుగా కురిసిన వర్షపాతం- 19.8 m. m
-
News4 weeks ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
News4 weeks ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News4 weeks ago
అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ
-
News4 weeks ago
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
-
News3 weeks ago
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న
-
News1 week ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి బాలుడు మృతి