Connect with us

News

అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ

Published

on

కర్నూలు జిల్లా అదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ చేపట్టారు.  ఆయా పార్టీలు జేఏసీ గా ఎర్పడి డోల్చ పైహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వాక్ఫ్ భూములను దోచుకోనేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిం చారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వాక్ఫ్ బోర్డ్ బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలోని చంద్ర బాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీహర్ సీఎం నితీష్ కుమార్ రాబోవు రోజుల్లో మూల్యం చెల్లించు కోక తప్పదని హెచ్చరించారు.

నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు
నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు
నిరసన ర్యాలీ చేపడుతున్న దృశ్యాలు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

Published

on

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ  శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి  ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.

Continue Reading

News

పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్థాపన వ్యవస్థాపనకు మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన ధర్మ సంస్థాపన సూత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీదర్, షిమోగా పట్టాన లాంటి ప్రాంతాలలో సెట్ పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణ  విద్యార్థులను ఘోరంగా అవమానపరుస్తూ యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే పరీక్ష రాయటానికి అనుమతిస్తామని యజ్ఞోపవీతాన్ని కత్తిరించి డస్ట్ బిన్లలో వేయించిన తర్వాత పరీక్ష వ్రాయటానికి అనుమతించడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ, సమాఖ్య పురోహిత విభాగం  తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ

ప్రభుత్వాల దృష్టిలో యజ్ఞోపవీతం అంటే  తొమ్మిది దారాల బలమై ఉండవచ్చేమో కానీ హిందూ ధర్మం ప్రకారం వేదాలలో యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటో తెలియదు అనుకుంటాను  మానవుడు ధర్మబద్ధంగా జీవించి మోక్షం వైపు నడవడానికి మూలాధారమై బుద్ధిని జ్ఞానాన్ని తేజస్సును వర్చస్సును ఆరోగ్యాన్ని పవిత్రతను ఆయుష్షును పెంపొందించే సూత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతంలో ఉండే తొమ్మిది సూత్రాలు తొమ్మిది పరమపవిత్రమైన శక్తులు. ఓంకార అగ్ని నాగ సోమ పితృ ప్రజాపతి వాయు సూర్య విశ్వేదేవతత్వములు 9 ధార పోగులలో నిబిడి కృతమై ఉంటాయని తెలిపారు. ఈ యజ్ఞోపవీతాన్ని  దారుణంగా అవమానించిన ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ యజ్ఞోపవీతం తీయవలసి వస్తుంది అని పరీక్షనే వదులుకున్నటువంటి విద్యార్థులకు తిరిగి పరీక్షలు వ్రాయించాలని డిమాండ్ చేశారు. వేదాన్ని వేద ధర్మాన్ని మఠాలను పీఠాలను అవమానపరిచే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఇంతకు పూర్వం ఇదేవిధంగా వేద ధర్మాన్నిఅవమానించి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్న  రాష్ట్రాల అనుభవాలను గుర్తు చేశారు.

Continue Reading

News

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్  అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

మీడియాకు వివరాలందిస్తున్న సిఐ రాజశేఖర్ రెడ్డి
Continue Reading

Trending