Connect with us

News

పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్థాపన వ్యవస్థాపనకు మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన ధర్మ సంస్థాపన సూత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీదర్, షిమోగా పట్టాన లాంటి ప్రాంతాలలో సెట్ పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణ  విద్యార్థులను ఘోరంగా అవమానపరుస్తూ యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే పరీక్ష రాయటానికి అనుమతిస్తామని యజ్ఞోపవీతాన్ని కత్తిరించి డస్ట్ బిన్లలో వేయించిన తర్వాత పరీక్ష వ్రాయటానికి అనుమతించడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ, సమాఖ్య పురోహిత విభాగం  తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ

ప్రభుత్వాల దృష్టిలో యజ్ఞోపవీతం అంటే  తొమ్మిది దారాల బలమై ఉండవచ్చేమో కానీ హిందూ ధర్మం ప్రకారం వేదాలలో యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటో తెలియదు అనుకుంటాను  మానవుడు ధర్మబద్ధంగా జీవించి మోక్షం వైపు నడవడానికి మూలాధారమై బుద్ధిని జ్ఞానాన్ని తేజస్సును వర్చస్సును ఆరోగ్యాన్ని పవిత్రతను ఆయుష్షును పెంపొందించే సూత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతంలో ఉండే తొమ్మిది సూత్రాలు తొమ్మిది పరమపవిత్రమైన శక్తులు. ఓంకార అగ్ని నాగ సోమ పితృ ప్రజాపతి వాయు సూర్య విశ్వేదేవతత్వములు 9 ధార పోగులలో నిబిడి కృతమై ఉంటాయని తెలిపారు. ఈ యజ్ఞోపవీతాన్ని  దారుణంగా అవమానించిన ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ యజ్ఞోపవీతం తీయవలసి వస్తుంది అని పరీక్షనే వదులుకున్నటువంటి విద్యార్థులకు తిరిగి పరీక్షలు వ్రాయించాలని డిమాండ్ చేశారు. వేదాన్ని వేద ధర్మాన్ని మఠాలను పీఠాలను అవమానపరిచే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఇంతకు పూర్వం ఇదేవిధంగా వేద ధర్మాన్నిఅవమానించి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్న  రాష్ట్రాల అనుభవాలను గుర్తు చేశారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 30 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

30 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1623.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 71.795 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 43954 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil   క్యూసెక్కులు

Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1622.12 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 67.473 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 65182 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : Nil   క్యూసెక్కులు

Continue Reading

Trending