News
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం

కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్థాపన వ్యవస్థాపనకు మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన ధర్మ సంస్థాపన సూత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీదర్, షిమోగా పట్టాన లాంటి ప్రాంతాలలో సెట్ పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణ విద్యార్థులను ఘోరంగా అవమానపరుస్తూ యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే పరీక్ష రాయటానికి అనుమతిస్తామని యజ్ఞోపవీతాన్ని కత్తిరించి డస్ట్ బిన్లలో వేయించిన తర్వాత పరీక్ష వ్రాయటానికి అనుమతించడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ, సమాఖ్య పురోహిత విభాగం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

ప్రభుత్వాల దృష్టిలో యజ్ఞోపవీతం అంటే తొమ్మిది దారాల బలమై ఉండవచ్చేమో కానీ హిందూ ధర్మం ప్రకారం వేదాలలో యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటో తెలియదు అనుకుంటాను మానవుడు ధర్మబద్ధంగా జీవించి మోక్షం వైపు నడవడానికి మూలాధారమై బుద్ధిని జ్ఞానాన్ని తేజస్సును వర్చస్సును ఆరోగ్యాన్ని పవిత్రతను ఆయుష్షును పెంపొందించే సూత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతంలో ఉండే తొమ్మిది సూత్రాలు తొమ్మిది పరమపవిత్రమైన శక్తులు. ఓంకార అగ్ని నాగ సోమ పితృ ప్రజాపతి వాయు సూర్య విశ్వేదేవతత్వములు 9 ధార పోగులలో నిబిడి కృతమై ఉంటాయని తెలిపారు. ఈ యజ్ఞోపవీతాన్ని దారుణంగా అవమానించిన ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ యజ్ఞోపవీతం తీయవలసి వస్తుంది అని పరీక్షనే వదులుకున్నటువంటి విద్యార్థులకు తిరిగి పరీక్షలు వ్రాయించాలని డిమాండ్ చేశారు. వేదాన్ని వేద ధర్మాన్ని మఠాలను పీఠాలను అవమానపరిచే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఇంతకు పూర్వం ఇదేవిధంగా వేద ధర్మాన్నిఅవమానించి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్న రాష్ట్రాల అనుభవాలను గుర్తు చేశారు.
News
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


News
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 15 రూ.

ఆదోని 19 05 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 13/- రూపాయలు, రిటైల్: 1kg 15/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16 /- రూపాయలు


News
ఆదోని డివిజన్లో వర్షపాతం నమోదు..

ఆదోని డివిజన్లో శనివారం 17 వ తేది కురిసిన వర్షపాతం వివరాలను వెల్లడించిన అధికారులు
హోళగుంద – 64.2 m.m
ఎమ్మిగనూరు- 28.4 m.m
కౌతాళం – 22.0 m.m
పెద్దకడబూరు – 17.6 m.m
ఆదోని – 15.2 m.m
కోసిగి- 14.4 m.m
గోనెగండ్ల- 12.4 m.m
నందవరం – 3.8 m.m
మంత్రాలయం – 0.0 m.m
మొత్తం వర్షపాతం – 178.0 m. m
సుమారుగా కురిసిన వర్షపాతం- 19.8 m. m
-
News4 weeks ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
News4 weeks ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News4 weeks ago
అదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతి రేకంగా భారీ ర్యాలీ
-
News4 weeks ago
కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం
-
News3 weeks ago
కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న
-
News1 week ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి బాలుడు మృతి