Connect with us

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్

News

స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఈడెన్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ నీటిలో మునిగి ప్రిన్స్ (5) అనే బాలుడు మృతి చెందడం. తల్లి, తండ్రుల వెంట స్విమ్మింగ్ చేయడానికి వెళ్లిన ప్రిన్స్ అనే బాలుడు చిన్న పూల్ ల్ నుండి పెద్ద పూల్ లోనికి  వెళ్లిన తల్లి తండ్రులు గమనించక పోవడంతో నీటిలో మునిగిన బాలుడు ఈత కొడుతూ నీటిలో మునిగి మృతి చెందడం. బాలుడి మృతదేహం ఈతగాళ్ల కాళ్లకు తగలడంతో బాలుడి మృతదేహాన్ని ఈతగాళ్లు బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఇతర్లించారు డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.

ప్రిన్స్ (5) ఫైల్ ఫోటో
Continue Reading

News

కర్నూల్ రేంజ్ ఏసిబి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన డిఎస్పి సోమన్న

Published

on

కర్నూలు జిల్లా: కర్నూల్ రేంజ్, ఉమ్మడి కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఎసిబి నూతన డిఎస్పీగా దివిటి సోమన్న 30 04 2025 వతేది బాధ్యతలు స్వీకరించరు. ఎసిబి డిఎస్పీ సోమన్న
ఎసిబి సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.  శ్దివిటి సోమన్న  స్వగ్రామం వేపకుంట గ్రామం, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా. 1991 లో ఎస్‌ఐ హోదాలో  పోలీసు డిపార్ట్మెంట్ లో  విధుల్లో నిర్వహించారు.
ఎస్‌ఐ గా క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, పి‌టి‌సి అనంతపురం నందు ప్రమోషన్ పొందిన తరువాత సి‌ఐ గా సి‌ఐడిలో, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లిలో పని చేసినారు. 2020 లో  డి‌ఎస్‌పిగా పదోన్నతి పొంది సి‌ఐడి శాఖలో మరియు ఆదోని సబ్ డివిజన్ లో పని చేశారు.

Continue Reading

News

కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం

Published

on

పెహెల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని
కర్నూలు జిల్లా ఆదోని భీమాస్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి ముస్లిం జేఏసి నాయకులు సంతాపం ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించరు. కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ  శత్రువులను కూడా క్షమించడమే మహమ్మద్ ప్రవక్త బోధన దానికి విరుద్ధంగా ఉగ్రవాదులు తాము ముస్లింలను చెప్పుకుంటూ సామాన్యులను చంపడం ఇస్లాంకు విరుద్ధమైన చర్య.దీన్ని ప్రతి ముస్లిం ఖండిస్తున్నారు అన్నారు. ఉగ్రవాదులను వెంటనే అరెస్ట్ చేసి  ఎర్రకోట ముందు బహిరంగంగా భారతదేశ ప్రజలందరూ చూస్తుండగా తలలు నరికి వేయాలని నూర్ అహ్మద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఆదోని ముస్లిం జేఏసి అండగా నిలబడుతుందని మద్ధతు ప్రకటించారు. మతసామరస్యం, దేశసమగ్రత కోసం ఆదోని ముస్లిం జేఏసీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
నాయకులు మహ్మద్ నూర్, సద్దాం హుస్సేన్, మన్సూర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రవాదు దాడులు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని అదేవిధంగా నిందితులను కఠినాతి కఠినంగా బహిరంగ శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంతాప సభలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంఘాల నాయకులు కన్వీనర్ నూర్ అహ్మద్, కో కన్వీనర్ మహమ్మద్ నూర్ ,నాయకులు లాయర్ సద్దాం హుస్సేన్, వసీం సాహెబ్, అర్షద్, మన్సూర్ , ఇస్మాయిల్, కౌన్సిలర్ హాజీ, ఫారుఖ్, జీలాన్, షకీల్ మరియు ముస్లిం యువత పాల్గొన్నారు.

Continue Reading

Trending