News
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లో
అక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
మట్కా బుక్కీలను 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని 11 మందిని రిమాండ్ కి తరలించారు..

వన్టౌన్ సిఐ శ్రీ రామ్ తెలిపిన వివరాలు యిలా ఉన్నాయి..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న పర్యవేక్షణలో రెండు రోజులుగా రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో తెల్లవారుజామున 05.00 గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కాస్తున్న బట్టీలను ద్వంశం చేసి, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి, డ్రమ్ములను ద్వంశం చేశామని తెలిపారు. మట్కా నిర్వహిస్తూ నాటు సారా అమ్ముతున్న 11 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి నుండి 11 వైట్ కలర్ ప్లాస్టిక్ క్యాన్ లలో 110 లీటర్ల నాటు సారాను మరియు మట్కా డబ్బులు Rs. 1,00,000/- లను స్వాదీనము చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండు కు తరలించామని తెలిపారు.

ముద్దాయిల వివరాలు :-
నాటు సారాలు పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act కింద
A1గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన బోయ అంజిని, వయస్సు: 40 సంవత్సము,
A2గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ మురళి, వయస్సు: 33 సంవత్సరాలు,
A3గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ లాల్, వయస్సు: 40 సంవత్సరాలు,
A4గా శుక్రవారిపేటకు చెందిన బోయ హరి కృష్ణ, వయస్సు: 34 సంవత్సరాలు,
A5గా బోయగేరికి చెందిన బోయ నాగి రెడ్డి, వయస్సు: 34 సంవత్సరాలు,

మట్కాలో పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act Sec 9(1) APG Act Matka కింద
A1గా మట్కరిగేరికి చెందిన భార్పెట్ మహమ్మద్ గౌస్, వయస్సు: 76 సంవత్సరాలు,
A2గా విక్టోరియా పేటకు చెందిన గొల్ల కన్న, వయస్సు: 41 సంవత్సరాలు,
A3గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా, వయస్సు: 36 సంవత్సరాలు,
A4గా అమరావతి నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా, వయస్సు: 59 సంవత్సరాలు,
A5గా బొబ్బులమ్మ దేవాలయం ప్రాంతనికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వయస్సు: 54 సంవత్సరాలు,
A6గా మట్కరిగేరికి చెందిన ఈడిగ నరసింహులు గౌడ్, వయస్సు: 71 సంవత్సరాలు,
ముద్దాయిలను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
