News
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లో
అక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
మట్కా బుక్కీలను 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని 11 మందిని రిమాండ్ కి తరలించారు..

వన్టౌన్ సిఐ శ్రీ రామ్ తెలిపిన వివరాలు యిలా ఉన్నాయి..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న పర్యవేక్షణలో రెండు రోజులుగా రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో తెల్లవారుజామున 05.00 గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కాస్తున్న బట్టీలను ద్వంశం చేసి, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి, డ్రమ్ములను ద్వంశం చేశామని తెలిపారు. మట్కా నిర్వహిస్తూ నాటు సారా అమ్ముతున్న 11 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి నుండి 11 వైట్ కలర్ ప్లాస్టిక్ క్యాన్ లలో 110 లీటర్ల నాటు సారాను మరియు మట్కా డబ్బులు Rs. 1,00,000/- లను స్వాదీనము చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండు కు తరలించామని తెలిపారు.

ముద్దాయిల వివరాలు :-
నాటు సారాలు పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act కింద
A1గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన బోయ అంజిని, వయస్సు: 40 సంవత్సము,
A2గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ మురళి, వయస్సు: 33 సంవత్సరాలు,
A3గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ లాల్, వయస్సు: 40 సంవత్సరాలు,
A4గా శుక్రవారిపేటకు చెందిన బోయ హరి కృష్ణ, వయస్సు: 34 సంవత్సరాలు,
A5గా బోయగేరికి చెందిన బోయ నాగి రెడ్డి, వయస్సు: 34 సంవత్సరాలు,

మట్కాలో పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act Sec 9(1) APG Act Matka కింద
A1గా మట్కరిగేరికి చెందిన భార్పెట్ మహమ్మద్ గౌస్, వయస్సు: 76 సంవత్సరాలు,
A2గా విక్టోరియా పేటకు చెందిన గొల్ల కన్న, వయస్సు: 41 సంవత్సరాలు,
A3గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా, వయస్సు: 36 సంవత్సరాలు,
A4గా అమరావతి నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా, వయస్సు: 59 సంవత్సరాలు,
A5గా బొబ్బులమ్మ దేవాలయం ప్రాంతనికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వయస్సు: 54 సంవత్సరాలు,
A6గా మట్కరిగేరికి చెందిన ఈడిగ నరసింహులు గౌడ్, వయస్సు: 71 సంవత్సరాలు,
ముద్దాయిలను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు