News
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లో
అక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
మట్కా బుక్కీలను 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని 11 మందిని రిమాండ్ కి తరలించారు..

వన్టౌన్ సిఐ శ్రీ రామ్ తెలిపిన వివరాలు యిలా ఉన్నాయి..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న పర్యవేక్షణలో రెండు రోజులుగా రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో తెల్లవారుజామున 05.00 గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కాస్తున్న బట్టీలను ద్వంశం చేసి, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి, డ్రమ్ములను ద్వంశం చేశామని తెలిపారు. మట్కా నిర్వహిస్తూ నాటు సారా అమ్ముతున్న 11 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి నుండి 11 వైట్ కలర్ ప్లాస్టిక్ క్యాన్ లలో 110 లీటర్ల నాటు సారాను మరియు మట్కా డబ్బులు Rs. 1,00,000/- లను స్వాదీనము చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండు కు తరలించామని తెలిపారు.

ముద్దాయిల వివరాలు :-
నాటు సారాలు పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act కింద
A1గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన బోయ అంజిని, వయస్సు: 40 సంవత్సము,
A2గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ మురళి, వయస్సు: 33 సంవత్సరాలు,
A3గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ లాల్, వయస్సు: 40 సంవత్సరాలు,
A4గా శుక్రవారిపేటకు చెందిన బోయ హరి కృష్ణ, వయస్సు: 34 సంవత్సరాలు,
A5గా బోయగేరికి చెందిన బోయ నాగి రెడ్డి, వయస్సు: 34 సంవత్సరాలు,

మట్కాలో పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act Sec 9(1) APG Act Matka కింద
A1గా మట్కరిగేరికి చెందిన భార్పెట్ మహమ్మద్ గౌస్, వయస్సు: 76 సంవత్సరాలు,
A2గా విక్టోరియా పేటకు చెందిన గొల్ల కన్న, వయస్సు: 41 సంవత్సరాలు,
A3గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా, వయస్సు: 36 సంవత్సరాలు,
A4గా అమరావతి నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా, వయస్సు: 59 సంవత్సరాలు,
A5గా బొబ్బులమ్మ దేవాలయం ప్రాంతనికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వయస్సు: 54 సంవత్సరాలు,
A6గా మట్కరిగేరికి చెందిన ఈడిగ నరసింహులు గౌడ్, వయస్సు: 71 సంవత్సరాలు,
ముద్దాయిలను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


-
News4 days agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News2 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News20 hours agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News1 week agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
