Connect with us

News

రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతం బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ రోడ్డు, లక్ష్మవ్వ సర్కిల్, సిరిగుప్ప సర్కిల్ మరియు టౌన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు విత్ రేడియం ఇండికేటర్స్ వేయాలని అలాగే సైన్ బోర్డ్స్, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపినారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తో మాట్లాడుతున్న డిఎస్పీ హేమలత
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

హై డ్రామా కు తెరలేపిన ఆదోని ఎమ్మెల్యే

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హైడ్రామాకు తేరలైపోయారు. డీఎస్సీ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అవకతవకలు జరిగి ఉంటే బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. దీనికి వైసిపి నాయకులు స్వీకరించి బహిరంగ చర్చలకు సిద్ధమని తెలపడంతో ఐదు గంటలకు వస్తాను అన్న పార్థసారధి కొద్ది దూరం వచ్చి తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై హైడ్రామా చేసి వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ముందుకు చేరుకున్న వైసిపి నాయకులు కార్యకర్తలు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

నిజంగా అవకతవకలు జరగలేదంటే మేము చర్చలకు ఎక్కడికైనా సిద్ధమని వైసిపి నాయకులు తేల్చి చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండిపడ్డారు.

పోలీస్ జీప్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సీఐ
ఎమ్మెల్యే తో మాట్లాడుతున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 09.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 09 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1624.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 75.644 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 40799 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1525 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 81.538 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

విశ్వనారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: పిడిఎస్‌యు డిమాండ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విశ్వనారాయణ కళాశాలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. స్థానిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు.

స్థానిక కార్యాలయంలో మాట్లాడుతున్న నాయకులు

ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి ఒకే భవనంలో సాధారణ ఇంటర్, ఒకేషనల్ కోర్సులు నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళాశాల నడుస్తోందన్నారు. తరగతులు జరుగుతుండగానే భవన నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending