News
రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి
కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి హేమలత జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు” – 2025 లో భాగంగా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతం బసవేశ్వర సర్కిల్, ఆస్పరి బైపాస్ రోడ్డు, లక్ష్మవ్వ సర్కిల్, సిరిగుప్ప సర్కిల్ మరియు టౌన్ లో కొన్ని ముఖ్యమైన పాయింట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు విత్ రేడియం ఇండికేటర్స్ వేయాలని అలాగే సైన్ బోర్డ్స్, జీబ్రా లైన్స్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను కోరారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపినారు.
News
ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ (RDO) కె. అరుణాదేవి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ నయూమ్, అసిస్టెంట్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది, బీజేపీ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.
News
తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు
హోస్పేట: 13.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 13 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 87.454 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రవాహాల వివరాలు: ◆ ఇన్ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 26834 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్ఫ్లో 23290 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 2266 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.852 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
News
ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై రేపు ఆదోని కోర్టు లో విచారణ
ఆదోని, ఆగస్టు 12: ఆలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు విరూపాక్షి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు (ఆగస్టు 13, గురువారం) కోర్టులో విచారణ జరగనుంది. నేమకల్లు గ్రామానికి చెందిన ఒక ఎస్సీ మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షి మరియు ఆయన సోదరుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయపరమైన ఉపశమనం కోసం వారు ఆదోనిలోని 2వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు.
ఉభయ పక్షాల వాదనలు విన్న అనంతరం బెయిల్ మంజూరుపై న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని వెల్లడించనుండటంతో రేపటి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
News3 weeks ago
ఆదోనిలో నిధి కోసం క్షుద్రపూజలు
-
News3 weeks ago
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల విజయం..
-
News3 weeks ago
ఆదోనిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ
-
News4 weeks ago
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks ago
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
-
News6 days ago
ఆదోని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
-
News1 day ago
వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ
-
News4 weeks ago
ఆదోని డివిజన్ APRSA అధ్యక్షుడిగా రజినీకాంత్ రెడ్డి