News
వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన వ్యవసాయ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి
రైతులకు వివరించారు.

అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు. ఎకరానికి రెండు కిలోల బెల్లం 5 కిలోల తవుడు మరియు క్లోరోపైరీఫాస్ కలుపుకొని సాయంత్రం వేళల్లో ఉంటలుగా చేసి పొలమందు వెదజల్లడం వల్ల ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది అని తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెట్టకు వచ్చిన పంటలకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేయవలసిందిగా రైతులకు సూచించారు.

కొర్ర పంటలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు అధికారులు గమనించి దీనికి( కెల్డాన్) కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి పావు కిలో పిచికారి చేయాలని రైతులకు తెలిపారు.

పత్తి పంటలో దోమ ఉధృతిని తగ్గించడానికి పసుపు రంగు నూనె పూసిన అట్టలను ఎకరానికి 10 చొప్పున మొక్క కంటే కొద్దిగా ఎత్తులో ఉంచడం వల్ల తెల్ల మరియు పచ్చ దోమ యొక్క ఉధృతిని తగ్గించవచ్చని రైతులకు తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




