News
చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్.. వైద్య పరికరాలు ధ్వంసం, సిబ్బందిపై దాడి..
కర్నూలు జిల్లా..
◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..
◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..
◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రి
సెక్యూరిటీ సిబ్బంది..
◆ రోగి ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర
◆ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు..
◆ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించి అడ్డుపడిన సిబ్బంది పై విరుచుకుపడి ఆస్పత్రి వైద్య పరికరాలను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాడు.
బాధితుడి బాబాయి లక్ష్మన్న తెలిపిన వివరాల మేరకు ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర (30) అనే వ్యక్తికి గత వారం రోజులుగా మానసిక పరిస్తితి సరిగా లేక పోవడంతో చికిత్స నిమిత్తం

సెక్యూరిటీ సిబ్బంది
ఈ రోజు ఉదయం ఆదోని జనరల్ ఆసుపత్రికి తీసుకునివచ్చారు. క్యాజువాలిటీ వార్డులో తనకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది నీ చూసి భయానికి గురైన రాఘవేంద్ర కేకలు వేస్తూ సిబ్బంది పై దాడి చేయడమే కాకుండా అక్కడే ఉన్న వైద్య పరికరాలు మల్టిపెరా మానిటర్ , ఇన్ఫూషన్ పంప్ , పారా మానిటర్ , ఫ్యాన్ లను ధ్వంసం చేశాడు. చేతికి దొరికిన వస్తువుతో వీరంగం చేస్తూ వుండడంతో సెక్యూరిటీ సిబ్బంది అతి కష్టం మీద తాళ్ళతో బంధించి స్థంభానికి కట్టేశారు. రాఘవేంద్ర చేసిన వీరంగంతో ఆసుపత్రి కి దాదాపు ₹ 1.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు వైద్య అధికారి శ్రీనివాస నాయక్ తెలిపారు. ఈ ఘటన పై వైద్య అధికారుల పిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




