News
చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్.. వైద్య పరికరాలు ధ్వంసం, సిబ్బందిపై దాడి..

కర్నూలు జిల్లా..
◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..
◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..
◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రి
సెక్యూరిటీ సిబ్బంది..
◆ రోగి ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర
◆ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు..
◆ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించి అడ్డుపడిన సిబ్బంది పై విరుచుకుపడి ఆస్పత్రి వైద్య పరికరాలను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాడు.
బాధితుడి బాబాయి లక్ష్మన్న తెలిపిన వివరాల మేరకు ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర (30) అనే వ్యక్తికి గత వారం రోజులుగా మానసిక పరిస్తితి సరిగా లేక పోవడంతో చికిత్స నిమిత్తం

సెక్యూరిటీ సిబ్బంది
ఈ రోజు ఉదయం ఆదోని జనరల్ ఆసుపత్రికి తీసుకునివచ్చారు. క్యాజువాలిటీ వార్డులో తనకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది నీ చూసి భయానికి గురైన రాఘవేంద్ర కేకలు వేస్తూ సిబ్బంది పై దాడి చేయడమే కాకుండా అక్కడే ఉన్న వైద్య పరికరాలు మల్టిపెరా మానిటర్ , ఇన్ఫూషన్ పంప్ , పారా మానిటర్ , ఫ్యాన్ లను ధ్వంసం చేశాడు. చేతికి దొరికిన వస్తువుతో వీరంగం చేస్తూ వుండడంతో సెక్యూరిటీ సిబ్బంది అతి కష్టం మీద తాళ్ళతో బంధించి స్థంభానికి కట్టేశారు. రాఘవేంద్ర చేసిన వీరంగంతో ఆసుపత్రి కి దాదాపు ₹ 1.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు వైద్య అధికారి శ్రీనివాస నాయక్ తెలిపారు. ఈ ఘటన పై వైద్య అధికారుల పిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు