Connect with us

News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే హక్కు రాష్ట్రపతికే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిజెపి నియంత ప్రభుత్వ వైఖరికి గిరిజన సంఘాలు మొత్తం ఏక కంఠంతో ఖండిస్తున్నాం అని అన్నారు. గిరిజన ప్రజానీకానికి ఈ దేశంలో అత్యున్నత స్థానం కల్పించేలా చేసిందని బిజెపి సంకలు గుద్దుకుండంతో నేడు అదే గిరిజన మహిళలకు నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం గోరమైన అవమానం అని నిప్పులు చెరిగారు. రాజకీయపరంగా గిరిజనులను బిజెపి ప్రభుత్వం అవసరానికి వాడుకుంటున్నాయని అనడంలో తేటతెల్లం అయిందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు మారుతి రావు, హనుమేష్, రామకృష్ణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు టూ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న నమోదైన FIR No.152/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. BNS సెక్షన్లు 126(2), 189(2), 292 r/w 190 కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం రెండు రోజుల్లోగా తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. హాజరయ్యే సమయంలో గుర్తింపు, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.

ముందుగా నోటీసు ఇచ్చిన ఫైల్ ఫోటో

నోటీసులోని ముఖ్య అంశాలు: ◆ విచారణకు సహకారం: కేసు దర్యాప్తులో భాగంగా దేవాను ప్రశ్నించాల్సి ఉన్నందున విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలి. ◆ ​ఆధారాల సమర్పణ: కేసుకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను పోలీసులకు అందజేయాలి. ◆ ​షరతులు: భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా సంబంధిత వ్యక్తులను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివి చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు. ◆ ​కోర్టు ఆదేశాలు: అవసరమైన సమయంలో కోర్టుకు మరియు చట్ట ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.

ముందుగా నోటీసు ఇచ్చిన ఫైల్ ఫోటో

​వైఎస్ఆర్‌సీపీ పట్టణాధ్యక్షుడు బోయ దేవాకు పోలీసు నోటీసులు జారీ కావడం ఆదోని స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 12.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 12 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1627.61 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 85.359 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 34051 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 31431 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1680 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.123 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

​అదోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Published

on

◆ ​కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ◆ రామ్‌జలా, జైన్ టెంపుల్, పెద్దతుంబలం రామాలయం సందర్శన ◆ మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ప్రతిపాదనలు

రామ్ జల చెరువును పరిశీలిస్తున్న ఆర్డీవో మరియు అధికారులు

కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల తో అదోని డివిజన్ ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను మంగళవారం అదోని ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు ఉమ్మడిగా పర్యటన నిర్వహించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామ్‌జలా, జైన దేవాలయం, పెద్దతుంబలం ప్రాచీన రామాలయం, చిన్నతుంబలం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో

పర్యాటకులను ఆకర్షించేలా చేపటాల్సిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులు చర్చించారు. ముఖ్యంగా ​మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా పరిసరాల పారిశుధ్యం, వ్యర్థాల నియంత్రణ, ​సందర్శకుల కోసం ప్రయాణ, విశ్రాంతి సౌకర్యాలు​ఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ పర్యాటకులకు అనుకూలంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ప్రదేశాలలో అభివృద్ధి పనులను గుర్తించి, సమగ్ర నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డిఓ

​ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదోని ఆర్డీఓతో పాటు ఎంఆర్‌ఓ (తహశీల్దార్), మున్సిపల్ కమిషనర్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు యంగ్ ప్రొఫెషనల్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending