News
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే హక్కు రాష్ట్రపతికే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిజెపి నియంత ప్రభుత్వ వైఖరికి గిరిజన సంఘాలు మొత్తం ఏక కంఠంతో ఖండిస్తున్నాం అని అన్నారు. గిరిజన ప్రజానీకానికి ఈ దేశంలో అత్యున్నత స్థానం కల్పించేలా చేసిందని బిజెపి సంకలు గుద్దుకుండంతో నేడు అదే గిరిజన మహిళలకు నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం గోరమైన అవమానం అని నిప్పులు చెరిగారు. రాజకీయపరంగా గిరిజనులను బిజెపి ప్రభుత్వం అవసరానికి వాడుకుంటున్నాయని అనడంలో తేటతెల్లం అయిందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు మారుతి రావు, హనుమేష్, రామకృష్ణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


