News
ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు పిల్లలు పెద్దలు వృద్ధులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్ల ఆపరేషన్ కళ్ళకు అత్యాధునిక లెన్స్ కూడా ఉచితంగా అమర్చి కంటి బాధితులకు ఉచిత వసతి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నుండి కర్నూలు మరియు కర్నూలు నుండి అదోనికి వచ్చేవరకు రవాణా సౌకర్యం కల్పించబడునని అలాగే ఆపరేషన్ చేయించుకునెవారు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు ఆపరేషన్లు మందులు ఇవ్వబడునని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత, ప్రతాప్ హిమబిందు, వంగదారి గీత, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.



News
అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న షేక్ షాకీర్ , అక్షయ్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెండి బిస్కెట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వెండిని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామని సిఐ తెలిపారు.


News
సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
ఆదోని 23-06-2026 మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఏర్పడిన వలయం.. మీరు ఫోటోలో చూస్తున్నది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఖగోళ దృగ్విషయం. దీనిని సూర్య పరివేషం (Solar Halo) లేదా 22-డిగ్రీల హాలో (22° Halo) అని పిలుస్తారు. పాతకాలంలో దీనిని చూసి వర్షం పడే సూచనగా భావించేవారు, ఎందుకంటే ఈ రకమైన మేఘాలు సాధారణంగా వాతావరణంలో మార్పును లేదా వర్షాన్ని సూచిస్తాయి.
ఇది ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం:
- మంచు స్ఫటికాలు (Ice Crystals): ఆకాశంలో చాలా ఎత్తులో ఉండే సిరస్ (Cirrus) మేఘాలలో మిలియన్ల కొద్దీ చిన్న చిన్న షడ్భుజి (hexagonal) ఆకారపు మంచు స్ఫటికాలు ఉంటాయి.
- కాంతి వక్రీభవనం (Refraction): సూర్యకాంతి ఈ మంచు స్ఫటికాల గుండా ప్రయాణించినప్పుడు, అది వంగి (refract అయి) దాదాపు 22 డిగ్రీల కోణంలో విడిపోతుంది.
- ఇంద్రధనస్సు లాంటి వలయం: ఇలా వక్రీభవనం చెందిన కాంతి సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయంలా (రింగ్ లా) మనకు కనిపిస్తుంది. దీని అంచులలో కొద్దిగా ఇంద్రధనస్సు రంగులు కూడా కనిపిస్తాయి.
