Connect with us

News

రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారస్తులు

Published

on

◆ రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ జలగలు
◆ అధిక వడ్డీలకు అప్పులు, కట్టలేకపోతే వేధింపులు..
◆ ఊళ్లు వదిలి వెళ్తున్న పలువురు బాధితులు..
◆ ఆత్మహత్యలూ చేసుకుంటున్న దుస్థితి..
◆ ఇళ్లు, ఆస్తులు రాయించుకుంటున్న వైనం..

విజయ్ ఫ్యామిలీ ఫోటో

వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి రైతులు, చిరు వ్యాపారులు, తోపుడుబండి, చాట్‌, చికెన, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగు ఊళ్లు వదులుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూళ్లకు పాల్పడుతున్నారు, ఇక ఆటోలపై ఫైనాన్స్ కావాలంటే డాకుమెంట్ చార్జెస్ అని ఆలస్యం అయితే ఫైన్ అని వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. వడ్డీలు కట్టలేక ప్రాణాలు వదులుతున్నారు.

కర్నూలు జిల్లా మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన విజయ్ అనే 32 సంవత్సరాల యువరైతు అప్పుల బాధ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం వచ్చి 20 రోజుల క్రితం భార్యా ఇద్దరు ఆడపిల్లలతో ఊరు వదిలి ఆదోనికి చేరుకొని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా వడ్డీ జలగల వేధింపులకు తట్టుకోలేక ఇటు సంసారం నడుపుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆదోని – ఇస్వి అప్ రైల్వే లైన్ KM NO: 499/15 వద్ద ట్రైన్ NO 12163 కింద పడి రైతు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రైల్వే ఎస్ఐ రామస్వామి ఇచ్చిన వివరాల మేరకు మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన జి. పకీరప్ప కుమారుడు విజయ్ (32) అప్పుల బాధ తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామస్వామి తెలిపారు.

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending