News
40 సం. గా ఉన్నాము పొజిషన్ సర్టిఫికెట్ ఇవండి.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-

- ఆదోని మండలం మండగిరి గ్రామపంచాయతీకి చెందిన అనీష్ ఫాతిమా సంబంధించి సర్వేనెంబర్ 204/బి 1 నందు 3.70 ఎకరాల భూమికి సంబంధించి ఆన్లైన్ మరియు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం కల్లుబావి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము సదరు ఇంటి స్థలానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు దయతో పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయవలసినదిగా కల్లుబావికి చెందిన బాలరాజు అర్జీ సమర్పించుకున్నారు.
- టిడ్కో ఇంటి కోసం గతంలో లక్ష రూపాయలు బ్యాంక్ డిడి ద్వారా చెల్లించాము. ప్రస్తుతం మాకు ఎటువంటి టిడ్కో గృహం మంజూరు కాలేదు. దయతో బ్యాంక్ డిడి ద్వారా చెల్లించిన నగదును తిరిగి ఇవ్వవలసినదిగా ఆదోని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన దాసరి యశోద అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన పకీరప్ప సంబంధించి 2024 – 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి నా యొక్క కూతురు వెన్నెలకు ఎనిమిదవ తరగతి బదులుగా ఆరవ తరగతి తప్పుగా ఆన్లైన్లో నందు నమోదు చేయడం ద్వారా కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి అడ్మిషన్ మంజూరు కాలేదు. దయతో నాకు కూతురుకు 8వ తరగతి అడ్మిషన్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, డి ఎల్ పి ఓ నూర్జహాన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, ఆర్ అండ్ బి ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, పంచాయితీ రాజ్ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ వెంకట ప్రసాద్, ఆర్టీవో నాగేంద్ర, డి ఎల్ డి వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు