News
సాయి నామినేషన్కు తరలివచ్చిన జన ప్రభంజనం..
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నామినేషన్ వేసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓటేసి గెలిపించాలని ప్రజలను విన్నవించారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని అదే నమ్మకంతో నాలుగో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని తెలిపారు. వలస పక్షుల్ని నమ్మొద్దని విడదీసి పాలించు అన్న సిద్ధాంతంతో పోతున్న కూటమి పార్టీలను నమ్మొద్దని, తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.

News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


-
News4 days agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News2 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News20 hours agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News1 week agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
