News
సాయి నామినేషన్కు తరలివచ్చిన జన ప్రభంజనం..
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వై. సాయి ప్రసాద్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్ కు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నామినేషన్ వేసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓటేసి గెలిపించాలని ప్రజలను విన్నవించారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించామని అదే నమ్మకంతో నాలుగో సారి కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని తెలిపారు. వలస పక్షుల్ని నమ్మొద్దని విడదీసి పాలించు అన్న సిద్ధాంతంతో పోతున్న కూటమి పార్టీలను నమ్మొద్దని, తనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
