News
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు, ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంగా ఏర్పడి TATA IPL – 2024 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడులు చేపట్టినారు. దాడులలో ముద్దాయిలు ఎమ్మిగనూరు బై పాస్ వద్ద కల్వారీ కొండ దగ్గర ముల్లా కంపల చెట్ల క్రింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూన్న 1) ఆదోని మరాటిగేరికి చెందిన బోయ మహానంది, వయసు 49 సం. తండ్రి పేరు late బోయ రామన్న, 2) మరాట్ వాడికి చెందిన బోయ రమేశ్, వయస్సు 23 సంలు, తండ్రి పేరు బోయ మహానంది, 3) ఎమ్మిగనూరు మరెమ్మ గుడి సమీపంలో ఉంటున్న S. షహీద్, వయసు.40 సం.లు. తండ్రి పేరు జిలానీ, 4) కార్వాన్ పేటకు చెందిన బెస్త వినోద్, వయసు. 35 సం.లు S/O ఈరన్న, లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 లక్షల 50 వేలు నాలుగు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకొని ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.41/2024u/s 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Cricket Betting) Act కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.
వారు 22.04.2024 వ తేదీ న జరుగుచున్న ముంబై ఇండియన్స్ Vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భముగా క్రికెట్ బెట్టింగ్ అడే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తునారు. అందుకు వారిపైన ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో
కేసులు ఉన్నవి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని, మరాటిగేరునకు చెందిన గొల్ల భీమా, పెద్ద మసీదు ఏరియాకు చెందిన ఇస్మాయిల్, రాజరాజేశ్వరి నగర్ కు చెందిన పింజరి మహమ్మద్ ఖాసీం, కార్వాన్ పేట కు చెందిన వినోద్, LB స్ట్రీట్ కు చెందిన మూర్తి మరియు ఎమ్మిగనూరుకు చెందిన షాహీద్ లు క్రికెట్ బెట్టింగ్ ఆడే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. మొత్తం వసూలు చేసిన డబ్బులను నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఖాజా కు పంపించేవారని అందుకు వారికి రూ. 1000/- లకు రూ.2000/- లు కమిషన్ ఇస్తూ క్రికెట్ మ్యాచ్ కు టీమ్ లను బట్టి రూ 1000/- 1200, 1500, 1800, 2000 ల చొప్పున గెల్చిన వారికి
ఇచ్చేవారని సెల్ ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ ను నడుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని త్రీ టౌన్ CI P. నరసింహ రాజు తన సిబ్బంది H.C లక్ష్మణ స్వామి, P.C. నరేంద్ర, P.C.బి. పరశురాం, PC పరమేష్, PC D. గిరిబాబు, P.C. నరసింహులు, HG 134 ఇస్మాయిల్ పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు