News
పంట బీమా మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో కుప్పగల్, దొడ్డనగేరి, మంత్రికి, పెద్ద తుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లుర్ గ్రామాల్లో సచివాలయ ల్లో అధికారులకు 2023 వ సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి అని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి వ్యవసాయ కార్మిక- సంఘం రైతు సంఘం డిమాండ్ లతో వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులో మంజూరు చేయాలని, అందరికీ ఉపాధి పనులు కల్పించాలని, అదేవిధంగా సగానికి పైగా మిగిలిపోయిన రైతులకు 2023 వ సంవత్సరం నకు సంబంధించిన ఇన్స్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతులకు పంటల బీమా పరిహారం(ఇన్సూరెన్స్) చెల్లించాలని కోరారు.

మండల కార్యదర్శి రామాంజనేయులు, మాట్లాడుతూ కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.

మండల అధ్యక్షుడు రంగనాథ్, ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు శేఖర్, కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప మాట్లాడుతూ బోరు బావుల మోటర్లకు మీటర్లు బిగించడం రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు వెంకటేష్, కమల్ నాథ్, గోపాల్, కర్ణ, అబ్బాస్, అయ్యన్న, కెవిపిఎస్ నాయకులు పరమేష్, నాగరాజు,ఉలిగప్ప, ఆయా గ్రామాల రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




