News
పంట బీమా మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో కుప్పగల్, దొడ్డనగేరి, మంత్రికి, పెద్ద తుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లుర్ గ్రామాల్లో సచివాలయ ల్లో అధికారులకు 2023 వ సంవత్సరం పంటల బీమా ఇన్సూరెన్స్ మరియు పెండింగ్ లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి అని ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలి వ్యవసాయ కార్మిక- సంఘం రైతు సంఘం డిమాండ్ లతో వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులో మంజూరు చేయాలని, అందరికీ ఉపాధి పనులు కల్పించాలని, అదేవిధంగా సగానికి పైగా మిగిలిపోయిన రైతులకు 2023 వ సంవత్సరం నకు సంబంధించిన ఇన్స్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతులకు పంటల బీమా పరిహారం(ఇన్సూరెన్స్) చెల్లించాలని కోరారు.

మండల కార్యదర్శి రామాంజనేయులు, మాట్లాడుతూ కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చి నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.

మండల అధ్యక్షుడు రంగనాథ్, ఏపీ రైతు సంఘం మండల అధ్యక్షుడు శేఖర్, కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప మాట్లాడుతూ బోరు బావుల మోటర్లకు మీటర్లు బిగించడం రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల నాయకులు వెంకటేష్, కమల్ నాథ్, గోపాల్, కర్ణ, అబ్బాస్, అయ్యన్న, కెవిపిఎస్ నాయకులు పరమేష్, నాగరాజు,ఉలిగప్ప, ఆయా గ్రామాల రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు