News
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించరు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 42వ వార్డు కౌన్సిలర్ సి. హెచ్. లోకేశ్వరి చైర్ పర్సన్ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా 36 వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి ప్రతిపాదించరు మరియు 40 వార్డు కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ బలపరచడంతో సి. హెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలకు 36 మంది వార్డు కౌన్సిలర్లు మరియు ఎమ్మెల్సీ డాక్టర్. మధుసూదన్ పాల్గొన్నారు.
అనంతరం, ప్రెసిడింగ్ ఆఫీసర్ & సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సి. హెచ్. లోకేశ్వరి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య పాల్గొన్నారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


News
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న 7 మంది బెట్టింగ్ రాయుల్లను సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 91 లక్షల నగదు స్వాధీనం, 7 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాలామంది యువకులు క్రికెట్ బెట్టింగ్ ను ఆన్ లైన్ లో ఆడుతూ, బెట్టింగ్ కు వ్యసనపరులుగా మారి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా అప్పులు చేసి మరీ, ఆ అప్పులు తీర్చలేకఇంట్లో తల్లితండ్రులకు చెప్పుకోలేక , తమ భవిష్యత్తు పై వారి తల్లి తండ్రులు పెట్టుకున్న ఆశలను అడియశలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుచున్నాయని బెట్టింగ్ ను ఎలాగైనా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పి M. హేమలత పర్యవేక్షణ లో ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ మరియు వారి సిబ్బంది రాబడిన సమాచారము మేరకు 18.05.2025 వ తేదీన సాయంత్రం 03.30 గంటలకు వాల్మీకి నగర్ లోని వాల్మీకి గుడి కి ఎదురుగా మొబైల్ ఫోన్ లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై దాడి చేసి ఎస్. ఆర్.నాగరాజును అదుపులోనికి తీసుకోగా మిగిలిన ముద్దాయులు పారిపోయారు. అతని నుండీ నగదు 50,000 వేల రూపాయలను స్వాదీన పరచుకుని ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఏపీ గేమింగ్ యాక్ట్ ( క్రికెట్ బెట్టింగ్ ) క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.



టెక్నాలజీ ఆధారంగా దొరికిన సమాచారం మేరకు సిఐ శ్రీ రామ్ కర్నూలు, హైదరాబాదు, ఒంగోలు, చిలకలూరు పేట, బెంగళూరు సిటిలో పూర్తి సమాచారాన్ని తెలుసుకొని 30.05.2025వ తేదీన మద్యాహ్నం 11.30 గంటలకు ఆదోని టౌన్ లోని ఎల్లమ్మ కొండ లోని మర్రి చెట్టు దగ్గర 7 మంది
1. ఆదోని పట్టణం మసీదుపుర కు చెందిన ఇస్మాయిల్ @ ఇస్మాయిల్, వయసు 44 సం. లు
2. ఆదోని పట్టణం బోయగిరికి చెందిన బోయ మహానంది వయసు 55 సం. లు,
3. ఆదోని పట్టణం మరాఠి వీధికి చెందిన బోయ రమేశ్, వయసు 26 సం. లు,
4. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీకి చెందిన చిక్కబళ్లాపూర్ వాసి రాజేష్, వయసు 38 సం. లు,
5. ఒంగోలు జిల్లా జరుగుమల్లి మండలం, ఎద్దులూరిపాడు గ్రామనికి చెందిన చుండి శ్రీనివాస రావు @ నాయుడు, వయసు 48 సం .లు,
6. ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ సత్యనారాయణపురం కు చెందిన అడ్డాల కల్యాణ్, వయసు 33 సం,
7. హైదరాబాద్ కు చెందిన రఘు ఆచారి
ఏడు మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 07 మొబైల్ ఫోన్ లు 91,00,000 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముందు హాజరు పరచరు.
వీరు ఆడుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్స్
1. నేషనల్ ఎక్సేంజ్ 9
2. రాధే ఎక్సేంజ్ ,
3. వజ్రా ఎక్సేంజ్,
4. నేషనల్ 777,
5. మోర్ ఎక్సేంజ్

ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి సాంకేతికత సహాయంతో క్రికెట్ బుకీలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన ఆదోని డిఎస్పీ హేమలతను , ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ మునిస్వామి, రంగస్వామి, ఏకవీర, ఫక్కీరప్ప, హుస్సేన్ భాషాలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 31 05 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
కౌతాళం మండలం లో దారుణం

కౌతాళం మండలం వల్లూరు లో దారుణం చోటుచేసుకుంది…. అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు ఏడేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు.. బాలిక కు చాక్లెట్, బిస్కెట్, కర్జికాయలు కొనిస్తానని మాయ మాటలు చెప్పి దారుణానికి ఒడి గట్టాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి వద్ద కు వెళ్లగా రంగస్వామి పరారయ్యాడు….బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కౌతాళం పోలీసులు తెలిపారు.
-
News2 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News3 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News11 hours ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News3 weeks ago
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
-
News3 weeks ago
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర
-
News3 weeks ago
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని DSF,PDSO డిమాండ్
-
News5 days ago
ఆదోని డివిజన్ లో కురిసిన వర్షపాత నమోదు
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర