News
ఎంపీ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ముద్దాయిగా విచారణలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కేసులు సిబిఐ వార్త కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై, కెమెరామెన్ పై దాడి చేసిన వారిని, ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని శుక్రవారం సబ్ కలెక్టర్ కు రామాంజనేయులు వెంకటేష్ మాల రవి రామంజి వినతి పత్రం అందజేశారు. వివేకానంద రెడ్డిని సిబిఐ అధికారులు విచారణకు పిలవడం జరిగిందని గుర్తు చేశారు. తన తల్లికి బాగాలేదని విచారణకు హాజరు కాలనీ లాయర్లకు చెప్పి పులివెందులకు బయలుదేరిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అవినాష్ రెడ్డినీ సిబిఐ అధికారులు వెంబడించడంతో వార్తకు కవరేజ్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపై దాడి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. పాత్రికేయుల వాహనాలు ధ్వంసం చేయడమే కాకుండా కెమెరాలను ధ్వంసం చేసి అడ్డుకోబోయిన రిపోర్టర్స్ పై భౌతిక దాడి చేయడం ప్రజాస్వామ్యం బతికుందా అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య విషయంపై ఏమి జరుగుతుందో ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయాన్ని అందరికి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులపై దాడికి పాల్పడడం బావ స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే ఎంపీ అవినాష్ రెడ్డి పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




