Connect with us

News

మౌలిక సదుపాయాలు కల్పించాలి. CPM పార్టీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, స్మశాన వాటిక సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో జనార్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న, కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి మాట్లాడుతూ
ఆదోని మండలంలో త్రాగునీరు సమస్య పరిష్కారానికి
1. నెమలికల్ ఎస్ ఎస్ ట్యాంక్ నుండి బసరకోడు వరకు అదనపు పైప్ లైన్, కుప్పగల్లు ఎస్ ఎస్ ట్యాంక్ నుండి పాండవగల్లు వరకు అదనపు పైప్ లైన్ వేయాలి..
2. హనుమాన్ స్కీం దగ్గర మరియు కుప్పగల్ స్కీం దగ్గర దగ్గర ఫిల్టర్ బెడ్లు ఏర్పాట్లు చేయాలి..
3. పెద్ద తుంబలం ఎస్ఎస్ ట్యాంక్ వెడల్పు చేయాలి..
4. చిన్న హరివాణం ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే కుల్లూరు మరియు పెద్ద హరివాణం వరకు పైప్ లైన్ వేయాలి..
5. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల సమస్యలు పరిష్కరించాలి..
6. గనేకల్ కుప్పగల్లు, నారాయణపురం గ్రామాలలో స్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలి..
7. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి..
8. గణేకల్లు, బల్లెకల్ గ్రామాలలో జడ్పీ స్కూళ్ళ లో టీచర్ల కొరత తీర్చాలి..
9. బల్లె కల్లు, పెద్ద తుంబలం గ్రామాల్లో జడ్పీ స్కూళ్ళకు రోడ్లు వేయాలి..
10. పాండవగల్ మండల పరిషత్ స్కూల్ కి సిసి రోడ్డు, డ్రైనేజీ వేయాలి.. 
11. పాండవగల్లు, గోనబావి గ్రామాల్లో ఆక్రమణకు గురైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
12. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు వేయాలి..
తెలిపిన 12 డిమాండ్లను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు భాష, పాండురంగ, తిక్కప్ప శాఖ కార్యదర్శులు అనిఫ్ భాష, రామాంజనేయులు, తాయన్న, తిక్కన్న, గ్రామాల పార్టీ సభ్యులు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాయకులు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

News

ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న  ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.

ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప  బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో  చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరిశీలిస్తున్న పోలీసులు
Continue Reading

Trending