News
పెండింగ్ లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి

పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి. తిక్కప్ప మాట్లాడుతూ కుప్పగల్లు, సంతేకూడ్లుర్ గ్రామాల్లో ఉపాధి కూలీలకు ఐదు వారాలు పైగా ఉపాధి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, బిల్లులు చెల్లింపులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ అలవెన్స్, గడ్డపార సాన పెట్టుకోవడానికి వేతనం కొనసాగించాలని, అదేవిధంగా ఉపాధి కూలీలకు త్రాగడానికి నీరు, నీడ, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉపాధి కూలీలను సమీకరించి మే నెల 22వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

News
అక్రమంగా నిలువ ఉంచిన కర్ణాటక ఎరువులు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. నబి ట్రేడర్స్ లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకొచ్చిన 76 డి ఎ పి ఎరువుల సంచులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ శాఖా అధికారులు తెలిపారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.


News
తుంగభద్రా డ్యాం 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఇరవై (20) గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన డ్యామ్ అధికారులు. (2.5) రెండు నర్ర అడుగులు ఎత్తుకు 20 గేట్లు ఎత్తి దిగువకు 62766 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
.
News
తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
.
-
News2 days ago
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల
-
Business1 day ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News5 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News1 day ago
తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
News11 hours ago
తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు
-
Business2 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News15 hours ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025
-
News2 days ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు