కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న కాలనీకు 7కోట్ల 50 లక్షలతో డీఎస్పీ బంగ్లా నుంచి దానపురం వరకు అలాగే ఆలూరు రోడ్డు వరకు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ మండగిరి లేఔట్ లో జగనన్న కాలనీలో దాదాపు పదివేల 90 ప్లాట్లు ఇవ్వడం జరిగిందాని జగనన్న కాలనీకి లింక్ గా ఉన్న రోడ్డును డీఎస్పీ బంగ్లా నుంచి ధనాపురం వరకు ఏడు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా కౌన్సిలర్లు ఉస్మాన్ బాషా గడ్డం చంద్ర కాంట్రాక్టర్లు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *