News
ముఖ్యమైన వార్తలు
15వ తేదీ శనివారం ఫిబ్రవరి 2025 నలుదిక్కుల ముఖ్యమైన వార్తలు..
◆ రాజమండ్రిలో నకిలీ కరెన్సీ పట్టివేత ఐదుగురి అరెస్ట్ కోటి రూపాయల నకిలీ కరెన్సీ స్వాధీనం..
◆ సూర్యాపేట జిల్లా బొజ్జ గూడెం లో కూలీల ఆటో బోల్తా పదిమందికి గాయాలు
◆ జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతాలు.. ఆధారాలతో బయటపెట్టిన బాధితురాలు లక్ష్మి.. పవన్ కళ్యాణ్ అండతోనే రెచ్చిపోతున్నారని లక్ష్మీ ఆరోపణ..
◆ టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు..
ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి లత..
అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోహణంలు..
◆ ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి..
ప్రజల తరఫున పోరాటం చేస్తామన్న ఎమ్మెల్సీ కల్పిత..
◆ భక్తజన కేంద్రంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ.. పుణ్యస్నానాలు ఆచరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
◆ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన డికే అరుణ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీకే అరుణ..
◆ మోడీపై మాట్లాడితే గొప్ప వాలం అవుతం అనుకుటున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు..
◆ ఇవ్వాలి ఇవాళతో ముగియనున్న మస్తాన్ సాయి కస్టడీ..
కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు..
◆ నారాయణపేట జిల్లా మక్తల్ లో ఘరానా మోసం షేర్ మార్కెట్ పేరిట 100 కోట్లు దండుకున్న సేటుగాడు.. నెల్లూరు జిల్లా కావలిలో పట్టుబడ్డ సుభాని..
◆ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఆక్రమణల కూల్చివేత.. అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన జిహెచ్ఎంసి అధికారులు..
◆ ప్రకాశం జిల్లా కంభం లో దారుణం.. కొడుకును ముక్కలుగా నరికి చంపిన తల్లి.. సంచుల్లో పెట్టి కాలువలో పడేసిన సాలమ్మ..
◆ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం.. కాంటాక్ట్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై ఆందోళన..
◆ అల్లూరి జిల్లా వేలువాయిలో గిరిజనుల నివాసాలు కూల్చివేత.. పట్టా భూముల్ని ఆక్రమించారని నిర్మాణాలకు తొలగింపు.. ◆తమిళనాడులో ఈనెల 28న ప్రధాని మోడీ పర్యటన.. రామేశ్వరంలోని న్యూ పోమ్బన్ బ్రిడ్జ్ కు ప్రారంభోత్సవం..
◆ యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న బొలెరో వాహనం పదిమంది మృతి.. మహాకుంభమేళాకు వెళ్తుండగా ఘటన..
◆ యూపీ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపతి మురుమన్ దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన రాష్ట్రపతి..
◆అక్రమ వలసదారులపై అమెరికా కొరడా.. మరో 119 మంది భారతీయుల తరలింపు..
◆ వలస విమానాలు పంజాబ్లో ల్యాండింగ్ పై వివాదం.. భారత్ పరువు తీస్తున్నారు అన్న సీఎం భగవంత్ మాన్..
◆ డాలర్ విలువను తగ్గించాలని చూస్తే 100% ట్యరీప్.. బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక..
◆ బంగారం ప్రియులకు భారీ ఊరట.. 10 గ్రాముల పై 1100 రూపాయల తగ్గుదల..
◆ 2007 తర్వాత తొలిసారి లాభాలలో బిఎస్ఎన్ఎల్ క్యూ3 లో 262 కోట్లు లాభాలు..
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

News
మహిళా భద్రతపై అవగాహన సదస్సు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరియు ఆదోని డిఎస్పి శ్రీ హేమలత ఆదేశాల మేరకు, ఆదోని మండలం ధనాపురం గ్రామంలో మహిళా భద్రతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇస్వి పోలీస్ సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు.

అవగాహన కల్పించిన అంశాలు: ఈ సందర్భంగా సీఐ (CI) నల్లప్ప మరియు ఇస్వి ఎస్ఐ (SI) మహేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఆపద సమయంలో భయపడకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. సదస్సులో ప్రధానంగా ఈ క్రింది అంశాలపై అవగాహన కల్పించారు..

- డైల్ 112 (Dial 112): అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ‘డైల్ 112’ నంబర్ను ఎలా సంప్రదించాలో వివరించారు.
- సైబర్ క్రైమ్: సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
- రోడ్డు భద్రత: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు మితిమీరిన వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరికీ కనీస అవగాహన ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
News3 days agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News5 days agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News4 days agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News3 days agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News3 days agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News4 weeks agoఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
-
News3 days agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
