News
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో జన్మించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి చిన్న వయసులోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో తన పోరుబాటను ప్రారంభించి మరణం వరకు ఎర్రజెండా ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా, అనతి కాలంలోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులుగా, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన మరణం సిపిఎం పార్టీ మరియు వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడానికి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏచూరి రాజకీయ నాయకుడే కాక, రచయితగాను, ఉత్తమ పార్లమెంటు సభ్యుడు గా మంచి గుర్తింపు పొందారన్నారు. 1996 యూనిటెడ్ ఫ్రంట్, 2004 యూపీఏ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు లోనూ ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇండియా వేదికను నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర ఏచూరి దే అని అన్నారు. మతతత్వ బిజెపిని నిలువరించడం కోసం ఇండియా వేదికను బలోపేతం చేయడంలో ఆయన ముందున్నారన్నారు. అలాంటి నాయకుడు, మరణించడం వామపక్ష శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయని, ఆయన ఆశయ, సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పి ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తిప్పన్న, ముక్కన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు ఊచ్చిరప్ప, మరియు పట్టణ, మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, నాగేంద్ర, బి వెంకటేష్, అజీమ్ ఖాన్, మరియు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




