News
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు

సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో జన్మించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి చిన్న వయసులోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో తన పోరుబాటను ప్రారంభించి మరణం వరకు ఎర్రజెండా ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శిగా, అనతి కాలంలోనే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులుగా, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు ఎన్నికయ్యారని తెలిపారు. ఆయన మరణం సిపిఎం పార్టీ మరియు వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఆ లోటును భర్తీ చేయడానికి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏచూరి రాజకీయ నాయకుడే కాక, రచయితగాను, ఉత్తమ పార్లమెంటు సభ్యుడు గా మంచి గుర్తింపు పొందారన్నారు. 1996 యూనిటెడ్ ఫ్రంట్, 2004 యూపీఏ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు లోనూ ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇండియా వేదికను నిర్మించడంలో ప్రముఖమైన పాత్ర ఏచూరి దే అని అన్నారు. మతతత్వ బిజెపిని నిలువరించడం కోసం ఇండియా వేదికను బలోపేతం చేయడంలో ఆయన ముందున్నారన్నారు. అలాంటి నాయకుడు, మరణించడం వామపక్ష శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయని, ఆయన ఆశయ, సాధన కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ సంతాప సభలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పి ఈరన్న, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తిప్పన్న, ముక్కన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, రామాంజనేయులు ఊచ్చిరప్ప, మరియు పట్టణ, మండల కమిటీ సభ్యులు తిక్కప్ప, నాగేంద్ర, బి వెంకటేష్, అజీమ్ ఖాన్, మరియు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 38772 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38618 క్యూసెక్కులు
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 10 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 28/- రూపాయలు, రిటైల్: 1kg 30/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 08 08 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 33/- రూపాయలు, రిటైల్: 1kg 35/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు


-
News6 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 days ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News4 days ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News6 days ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News6 days ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన
-
News6 days ago
కర్రతో దాడి తలకు తీవ్ర గాయం
-
Business3 weeks ago
Gold, Silver Price బంగారు ధర