News
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..

◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..
◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్
◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..
◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి
కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, రెండు స్కూటర్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి వివరాల మేరకు 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నలుగురు బోయ మహానంది, పింజరి హుస్సేన్, మహమ్మద్ ఖాసిం, వడ్ల రాఘవేంద్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు. 4వ ముద్దాయి వడ్ల రాఘవేంద్ర గత ఐదు సంవత్సరాలుగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తున్నాడని డిఎస్పి తెలిపారు. మిగతా ముగ్గురు ముద్దాయిలు గత మూడు సంవత్సరాల నుంచి అతనితో కలిసి ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని మొదటి ముద్దాయి బోయ మహానంది పై 8 కేసులు ఉన్నాయని, 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ పై 6 కేసులు, 3వ ముద్దాయి గింజరి మొహమ్మద్ ఖాసిం పై 4 కేసులు 4గో ముద్దాయి వడ్ల రాఘవేంద్ర చారి పై 4 కేసులు పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయని డిఎస్పి వెల్లడించారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ శ్రీరామ్ ఎస్సై జయ శేఖర్ ఎస్సై చిన్న పీరయ్య సిబ్బంది నరేంద్ర మధు సోమేశ్ ఖాసిం వలి నరసింహ మంజు కుమార్ మురళి పోలీసులకు ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివ నారాయణ స్వామి రివార్డులను అందజేశారు.



News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
లారీ కింద పడి బాలుడు మృతి
-
News4 weeks ago
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష