News
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కోటి రూపాయలు విలువచేసే నగదు వాహనాలు సీజ్..
◆ ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ◆ ముఠా నలుగురు సభ్యులను అరెస్ట్..
◆ నిందితుల నుంచి 80 లక్షలు నగదు స్వాధీనం ఒక కారు రెండు బైకులు సీజ్
◆ పరారీలో మరో ఆరుగురు నిందితులు..
◆ వివరాలు వెల్లడించిన డిఎస్పి శివ నారాయణస్వామి
కర్నూలు జిల్లా ఆదోని పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80 లక్షల నగదు ఒక కారు, రెండు స్కూటర్లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి వివరాల మేరకు 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నలుగురు బోయ మహానంది, పింజరి హుస్సేన్, మహమ్మద్ ఖాసిం, వడ్ల రాఘవేంద్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు. 4వ ముద్దాయి వడ్ల రాఘవేంద్ర గత ఐదు సంవత్సరాలుగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తున్నాడని డిఎస్పి తెలిపారు. మిగతా ముగ్గురు ముద్దాయిలు గత మూడు సంవత్సరాల నుంచి అతనితో కలిసి ఈ బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారని మొదటి ముద్దాయి బోయ మహానంది పై 8 కేసులు ఉన్నాయని, 2వ ముద్దాయి పింజరి హుస్సేన్ పై 6 కేసులు, 3వ ముద్దాయి గింజరి మొహమ్మద్ ఖాసిం పై 4 కేసులు 4గో ముద్దాయి వడ్ల రాఘవేంద్ర చారి పై 4 కేసులు పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై కేసులు ఉన్నాయని డిఎస్పి వెల్లడించారు. వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ శ్రీరామ్ ఎస్సై జయ శేఖర్ ఎస్సై చిన్న పీరయ్య సిబ్బంది నరేంద్ర మధు సోమేశ్ ఖాసిం వలి నరసింహ మంజు కుమార్ మురళి పోలీసులకు ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివ నారాయణ స్వామి రివార్డులను అందజేశారు.



News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


News
ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్
ఆదోనిలో అధికారులు మెరుపు దాడులతో విరుచుకుపడ్డారు. సామాన్యుడి పొయ్యి వెలగాల్సిన డొమెస్టిక్ గ్యాస్ను.. హోటళ్లలో వాడుతూ సొమ్ము చేసుకుంటున్న గ్యాస్ మాఫియా గుట్టు రట్టు చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హోటల్ యజమానుల ఆటలు సాగనివ్వమని సివిల్ సప్లై అధికారులు తేల్చి చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి, తక్కువ ధరకు వచ్చే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారనే ఫిర్యాదుతో అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో DSO రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలు పట్టణంలోని గల్లీ గల్లీని జల్లెడ పట్టాయి. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, చిన్నా చితకా హోటళ్లు అని తేడా లేకుండా అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తనిఖీ చేసిన 88 హోటళ్లలో 107సిలిండర్లు సీజ్ చేసి వారిపై ఎసెన్షియల్ కమ్యూడిటి యాక్ట్ సెక్షన్ 6ఎ క్రింద కేసు నమోదు చేశారు. గృహ వినియోగ గ్యాస్ను వ్యాపారాలకు వాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్ఓ రాజా రఘువీర్.
ప్రస్తుతానికి ఈ దాడులు ఆదోని హోటల్ యజమానుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా సిలిండర్లు దాచిన వారు ఇప్పుడు వాటిని ఎక్కడ దాచుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరి అధికారులు ఈ జోరును ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి..



News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
