News
వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ ఆర్టీఓ లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీఓ అధికారులమంటూ వాహన దారుల వద్ద వసూళ్లుకు పాల్పడిన ఇద్దరూ నిందితులు అశోక్ కుమార్ (27), వినోద్ (28) లను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఐ సీఐ శ్రీరామ్.
వన్ టౌన్ సిఐ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆర్టీఓ లమని వసూళ్లకు పాల్పడుతున్న ముద్దాయిలను శుక్రవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన అశోక్ కుమార్ వయస్సు 27 సం. మరియు ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన పొట్లపాడు వీరేష్, వయస్సు 28 సం. వీరిద్దరిని ముద్దాయిలుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిపై PS Cr. No. 105/2024 U/s 308(3),319(1), 126(2),204, 115(2),324(4) BNS of Adoni I Town PS కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

వివరాలు ఇలాఉన్నాయి.
సోమవారం 07.10.2024 వ తేదీ రాత్రి 11:30 గంటలప్పుడు కేరళ రాష్ట్రానికి S. సుబీష్ (40) లారీ డ్రైవరు, క్లీనర్ వినోద్ తో కలసి KA 01 AJ 9676 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారిలో తాండూర్ నుంచి నాపరాయి ని లోడుతో ఆదోని టౌన్ లోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పై నిలబడి లారీని ఆపి తాళాలు తీసుకుని మేము RTO అధికారులము అని, లారీ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పి బెదిరించి, లారీ విడిచిపెట్టాలి అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలి అని డిమాండ్ చేశారని సిఐ తెలిపారు. అంత డబ్బు లేదు అన్నందుకు క్లీనర్ వినోద్ ఫోను తీసుకొని కిందకు పడేయడంతో, సెల్ ఫోన్ పగిలి డిస్ప్లే పోయినది. ఆ యిద్దరూ వారిపై దౌర్జన్యం చేస్తూ చేతులతో చెంపమీద, మెడమీద కొడుతుండగా డ్రైవరు మరియు క్లీనరు వారి నుండి తప్పించుకొవడానికి గట్టిగా కేకలు వేశారు అటువైపు వెళ్ళే వారు గుమ్మికూడడంతో వారు అక్కడినుండి పారి పోయారని డ్రైవర్ సుభీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ శ్రీ రామ్ కేసు నమోదు చేసామని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




