Connect with us

News

హెచ్చరికలు జారీ చేసిన తుంగభద్రా డ్యాం అధికారులు

Published

on

తుంగభద్రా డ్యాం:  నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి ప్రవాహంకు తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఉదయం 7 గంటలకు 1లక్ష 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్టు తుంగభద్ర డ్యాం అధికారులు ప్రకటించారు. నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందునా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగా గజాయితగాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

నది తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండండి..
◆ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండండి..
◆ గ్రామ ప్రజలు నదితీరా ప్రాంతాల్లోకి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి.
◆ ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
◆ నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్లోని కౌతాళం మండలం మేలగనూరు మరియు కుంబలనూర్ , నది తీర ప్రాంతాలను పరిశీలించి తనిఖీ చేశారు. ఆదోని డివిజన్లో తీర ప్రాంతంలో ఉన్న కౌతళం, కోసిగి, నందవరం మండలలో నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తీరప్రాంతంలో సంబంధిత మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఇరిగేషన్, గజఈతగాళ్లు, అప్రమత్తంగా ఉండాలన్నారు. లైఫ్ జాకెట్లు, SDRF బృందాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఆదోని డివిజన్లో రెండు టీం రాష్ట్ర విపత్తు రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండగా వారికి పలు సూచనలు సబ్ కలెక్టర్ చేశారు.

నదీతీర ప్రాంతాల్ని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అధికారులు
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-09-2025

Published

on

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 15429 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 15327 క్యూసెక్కులు

హైడ్రాలిక్ పైపుల అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

భారీ వర్షనికి రామజల చెరువు నిండి  ఇళ్లలోకి నీరు

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షనికి రామజల చెరువు నిండి ప్రవహించడంతో  చుట్టూ ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. మొత్తం ఆదోని డివిజన్లో 722 మిల్లీమీటర్లు కురవగా ఒక ఆదోనిలో అత్యధిక వర్షపాతం 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో నిజాముద్దీన్ కాలనీ, తిరుమల నగర్, కార్వాన్ పేట, ఖునిమొహాళ్ల, గోఖర్జెండా జలమయమయ్యాయి. వంకలు పొంగి వరద నీరు పోటెతడంతో పంట పొలాలు నీట మునిగాయి.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
నీట మునిగిన కార్
రంజర్ల చెరువు వద్ద ప్రవహిస్తున్న నీరు
కాలనీలో వచ్చి చేరిన నీరు
Continue Reading

Trending