News
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందం ఆదోని ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యులు డా.పార్థసారథి వాల్మీకి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రాంతంలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో ప్రతి నెల సుమారుగా 450 ప్రసవాలు జరుగుతున్నాయని, 10 మంది నర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ఆదోని లో ఆరోగ్య శ్రీ క్రింద కొన్ని ఆస్పత్రులు రోగుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వలసల నివారణకు కస్తూర్బా, జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థినులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, శానిటరీ నాప్కిన్స్ అందజేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆదోని టూరిజంకు సంబంధించి కొండల్లో ఉన్న పురాతనమైన కట్టడాల కోసం మరియు రణమండల ఆంజనేయ స్వామి దేవాలయానికి రోడ్డు మార్గం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఆదోని ఆటో నగర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆదోని మార్కెట్ యార్డు లో మౌలిక వసతులు కల్పించాలని, మార్కెట్ యార్డు లో దళారులు రైతులను వడ్డీ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




