Connect with us

News

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు

Published

on

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గాళ్లు
■ కల్తీ దందాపై సైబరాబాద్ ఎస్ఓటి పోలీసుల ఉక్కు పాదం..
■ అల్లం పేస్ట్ కల్తీ ముఠా అరెస్ట్..
■ బిర్యాని చికెన్ కర్రీలో రుచి కోసం కలిపే అల్లం పేస్ట్ కల్తీ కి పాల్పడుతున్నారు దుండగులు.

అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ
అల్లం వెల్లుల్లి కల్తీ పేస్ట్ ను తయారు చేస్తున్న పరిశ్రమ

హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో అక్రమంగా కలిసి దందా నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి సుమారు 500 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మరియు 200 లీటర్ల అసిటిక్ యాసిడ్ 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్లును సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లి ప్రమాదకరమైన కెమికల్స్ మరియు అపరిశుభ్ర వాతావరణంలో మురుగు నీటితో పేస్ట్ తయారు చేస్తున్నరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదకరమైన కెమికల్స్ ని కూడా కలుపుతున్నట్లు గుర్తించారు ఎస్ ఓ టి పోలీసులు. 2 సంవత్సరాలుగా ఈ దందా నిర్వహిస్తున్నరు. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్నరు నిర్వాహకులు. ఇద్దరు నిర్వాహకుల్ని అరెస్టు చేసిన విచారణ చేపట్టా అధికారులు. ఇటువంటి కల్తీ పేస్టులను తయారు చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లి మరియు ప్రమాదకరమైన కెమికల్స్
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు
ఆకర్షణీయమైన ప్యాకెట్లలో సప్లై చేస్తున్న నిర్వాహకులు

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending