News
T20 వరల్డ్ కప్ విజేతలకు బ్రహ్మరథం పట్టిన ముంబై సముద్రతీరం
ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలకు విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో అభిమానులు పాలుగోని ఘన స్వాగతం పలికారు. టీ20 ప్రపంచకప్ లో విజయం సాధిచిన టీమ్ ఇండియా ముంబైకి చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశ మే హద్దు అన్నట్లు కనిపించింది. ముంబై నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఓపెన్-టాప్ బస్ పై వాంఖడే స్టేడియం వరకు విజేతలకు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయోత్సవ ర్యాలీ కనుల పండగగా సాగింది.

ప్రపంచక విజేతలకు స్వాగతం పలకడానికి అభిమానులు మధ్యాహ్నం నుండే భారత జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ముంబై మొత్తం పండగ వాతావరణం నెలకొంది.టీం ఇండియా రావడానికి ఆలస్యంమైన అభిమానుల్లో ఉత్సాహం తగ్గలేదు. అభిమానులు “ముంబయి కా రాజా, రోహిత్ శర్మ” నినాదాలతో హోరెత్తించి సంబరాలు జరుపుకున్నారు.

గతంలో భారతదేశం 2007 మరియు 2011లో ప్రపంచ కప్ వచినప్పుడు విజయోత్స వాలను జరుపుకున్న ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఇండియా టీం రాకముందే స్టేడియం అభిమానులతో నిండిపోయింది. స్టేడియం లోపల విద్యుద్దీపాలతో వెలిగిపోయింది.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




