Day: March 5, 2024

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కరువు మండలాలకు రావలసిన 50 రోజుల పని దినాలు వెంటనే కల్పించాలని, కరువు సహాయక చర్యలు భాగంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 14 రకాలు నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కరువు మండలాల్లో కోరుతూ సీజనల్ హాస్టల్స్ ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో […]

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ డా.జి.సృజన, ఎస్పీ కృష్ణకాంత్, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మరియు ఎం ఐ జి లో ఉన్న నేషనల్ స్కూల్, కిడ్డీస్ స్కూల్ పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన సీసీ కెమెరాలు, ర్యాంప్, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ […]

ఆలూరులో వేడి పుట్టిస్తున్న రాజకీయం..

కర్నూలు జిల్లా ఆలూరులో వేడి పుట్టిస్తున్న రాజకీయం..విజయవాడకు చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మానురు జయరామ్..పెద్ద సంఖ్యలో వాహనాలకు టీడీపీ స్టికర్లు వేసుకొని విజయవాడకు పయనం..సాయంత్రం 7 గంటల కు టీడీపీ అధినేత చంద్రబాబు తో గుమ్మనూరు జయరామ్ కలుస్తారని సమాచారం..అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ టికెట్ పై చర్చించే అవకాశం..టికెట్ఇచ్చే విషయంలో ఒక క్లారిటీ వస్తే YSRCP మంత్రి పదవి కి రాజీనామా..టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ రాకపోతే విజయవాడలో […]

కర్నూలు వైయస్సార్సీపీ సమన్వయకర్త ఇంతియాజ్ అహ్మద్ ను కలిసిన సురేందర్ రెడ్డి

కర్నూల్ నగరం NR పేటలో కర్నూలు నియోజవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త ఏ. ఎండి. ఇంతియాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా జేసిఎస్ కోఆర్డినేటర్ తెర్నకల్ సురేందర్ రెడ్డి మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, తోఫిక్, నాని, పవన్, ముకేశ్, సతీష్, సూరి, యశ్వంత్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back To Top