Connect with us

News

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

Published

on

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)AP
Exice Act నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో S.I K.P. ప్రహల్లాద మరియు సిబ్బంది H.C మద్దిలేటి,PC’c మధు నాగరాజు రంగస్వామి పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

​అదోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Published

on

◆ ​కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ◆ రామ్‌జలా, జైన్ టెంపుల్, పెద్దతుంబలం రామాలయం సందర్శన ◆ మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ప్రతిపాదనలు

రామ్ జల చెరువును పరిశీలిస్తున్న ఆర్డీవో మరియు అధికారులు

కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల తో అదోని డివిజన్ ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను మంగళవారం అదోని ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు ఉమ్మడిగా పర్యటన నిర్వహించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామ్‌జలా, జైన దేవాలయం, పెద్దతుంబలం ప్రాచీన రామాలయం, చిన్నతుంబలం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో

పర్యాటకులను ఆకర్షించేలా చేపటాల్సిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులు చర్చించారు. ముఖ్యంగా ​మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా పరిసరాల పారిశుధ్యం, వ్యర్థాల నియంత్రణ, ​సందర్శకుల కోసం ప్రయాణ, విశ్రాంతి సౌకర్యాలు​ఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ పర్యాటకులకు అనుకూలంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ప్రదేశాలలో అభివృద్ధి పనులను గుర్తించి, సమగ్ర నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డిఓ

​ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదోని ఆర్డీఓతో పాటు ఎంఆర్‌ఓ (తహశీల్దార్), మున్సిపల్ కమిషనర్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు యంగ్ ప్రొఫెషనల్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు […]

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న పిడిఎస్యు నాయకులు

​అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట బైఠాయించిన పిడిఎస్యు నాయకులు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు.

మెడికల్ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రసవం అనంతరం బాలింతలను, పసిపాపలను సురక్షితంగా, ఉచితంగా ఇంటికి చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారధి

​ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణు వర్మ, నాయకులు ఉపేంద్ర కుమార్, మధుసూదన్ శర్మ, ప్రశాంత్ కుమార్, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending