News
కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం

◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు
◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ
◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు
కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా మూల మూలన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏ పార్టీ అయితే 113 సీట్లు రాబట్టుకుంటుందో అది కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈసారి కన్నడ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతున్నట్లు అనేక ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపికి 79 నుంచి 49 స్థానాలు రావచ్చుని ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. జెడిఎస్ కు 24 నుంచి 34 సీట్లు కె పరిమితమవుతుందని అంటున్నారు.

ఇంకా 6 రోజుల్లో పోలింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన సీఎం బెట్టిని ప్రకటించలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది

ప్రజాధరణలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎం కొనసాగారు గడిచిన 40 ఏళ్లలో పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్న తొలి సీఎం గా సిద్ధార్థ రామయ్య ఉన్నారు కర్ణాటకలో ఈయన బాగా ఫేమస్ 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకప్పుడు జిడిఎస్ అధినేత హెచ్డి దేవ గోడకు కుడి భుజం లాంటివాడు దేవగూడ కుమారుడు కుమారస్వామిని రాజకీయ వారసుడిగా ప్రకటించటంతో ఆయనతో విభేదించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర తీసి కాంగ్రెస్లో జోష్ నింపారు.

మరోవైపు కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నుంచి కెపిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు అయన అత్యంత సంపన్నుడు శివకుమార్ పార్టీని చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించిన వ్యక్తి. ఆయన బెంగళూరు సిటి కనకాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.
కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ఇద్దరు నాయకులు సీఎం రేస్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం పదవికి పోటీ పడవచ్చుని బహిరంగం గానే సిద్ధరామయ్య కూడా చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పోటీ చూస్తే కాంగ్రెస్లో చీలికలు వస్తాయని స్థానికులు విమర్శలు గుపిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య కు పార్టీపై ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు అందులో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కానీ శివకుమార్ కు ఆర్థిక అవకతవకలు మనీ లాంటి అవినీతి ఆరోపణ వెంటాడుతున్నాయి.
ప్రజా తీర్పు ఎటువైపు ఉందనేది ఈనెల 13వ తేదీ తెలియనుంది.
News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
News4 weeks ago
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర