Connect with us

News

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం

Published

on

కర్నూలు నగరంలో డి‌జి‌పి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏ‌సి‌బి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు

అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత ఇంట్లో ఇంకా ఏ‌సి‌బి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400 అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు చేస్తున్న వీడియో

News

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాల నిషేధం దుర్మార్గం: PDSU ఖండన

​సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్‌ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ​పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు […]

Published

on

​సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) కర్నూలు జిల్లా అధ్యక్షుడు అఖండ డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంక్షేమ నిధులను దోచుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. సర్కులర్‌ను రద్దు చేయకపోతే ‘చలో సంక్షేమ భవన్’ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ​పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ఆదోనిలోని ఎమ్మిగనూరు సర్కిల్ వద్ద PDSU ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. విద్యార్థులు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు

​ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు అఖండ, డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ.​ ■ హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వం: అధికారంలోకి రాకముందు రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ■​సమస్యల నిలయాలుగా హాస్టళ్లు: విద్యార్థులకు సొంత భవనాలు నిర్మించాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచి నాణ్యమైన పోషకాహారం అందించాలని కోరారు. ■ ​పోరాటాలకు సిద్ధం: గతంలో పేద విద్యార్థులకు అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఏవిధంగా సాగనంపారో, హామీలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ■ ​పోస్టుల భర్తీ: హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, కమాటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్డుపై నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు

​ఈ నిరసన కార్యక్రమంలో మండల నాయకులు రసూల్, బసవ, పవన్, విష్ణుముని, హుసేని, వంశీ, శశిధర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు..

Continue Reading

News

విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది.. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ఆదోని వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ఆదోనిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ◆ ఉద్యోగాల మోసం: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో మరియు స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చి పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెడుతున్నారని […]

Published

on

ఆదోని వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శనివారం ఆదోనిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ◆ ఉద్యోగాల మోసం: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డీఎస్సీ ప్రక్రియలో మరియు స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చి పార్టీ కార్యకర్తలకే ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ◆ హామీల అమలు ఏది?: ‘సూపర్ సిక్స్’ పథకాలను అరకొరగా అమలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని, మహిళలకు ఇచ్చిన ₹1,500 హామీ, 50 ఏళ్లకే పింఛన్ హామీల ఊసేత్తడం లేదని విమర్శించారు. ◆ శాంతిభద్రతల క్షీణత: ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరాన్ని టీడీపీ గుండాలు పెకిలించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, ఇలాంటి హింసాత్మక చర్యల వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తూ సోమవారం ఆదోనిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

​ఈ కార్యక్రమంలో దీక్షా పరులు చలపతి, తాయన్న, జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బి.దేవా, నాయకులు ఫయాజ్, రహింసాబ్, రామలింగేశ్వర యాదవ్, నల్లారెడ్డి మరియు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దీక్షా శిబిరం వద్ద సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 07.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 07 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1622.55 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 68.776 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   47559 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 43814 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1497 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 74.486 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending