కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న ఉమ్మి సలీం అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తు నుంచి ఆరేళ్ల బాలుడు తన్వీర్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. తన్వీర్ మేనత్త నిద్రిస్తుండగా బాలుడు తన్వీర్ లేచి ఆడుకుంటూ ఐదవ అంతస్తు నుంచి జారిపడ్డాడని బంధువులు తెలిపారు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.