కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు జనసేన నాయకులు సి.యం డౌన్ డౌన్ అంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆదోని భీమస్ సర్కిల్లో పవన్ కళ్యాణ్ కు నిప్పు పెట్టిన స్థలంలో పసుపు నీళ్లు చల్లి పోస్టర్ కు పాలాభిషేకం చేసి జనసేన నాయకులు నిరసన తెలిపారు.