అక్రమమద్యం రవాణాపై దాడులు ఒకరిఅరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివాణం చెక్ పోస్ట్ వద్ద ఆదోని పట్టణానికి చెందిన బోయ రాజు అనే వ్యక్తి ఒక సంచిలో 180 ML పరిమాణం ఉన్న 96 కర్ణాటక మద్యం ప్యాకెట్లు రవాణా చేస్తుండగా గుర్తించి అతనిని అరెస్టు చేసిన సెబ్ అధికారులు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలి. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ హరి కృష్ణ, చెక్ పోస్ట్ CI మంజుల SI లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శవంతో రోడ్డు పైన బైఠాయించి ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు సర్కిల్లో సోమవారం రోజు హత్యకు గురైన శంకర్ మృతదేహంతో ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. హత్య చేసిన నలుగురు రైస్ మిల్ వ్యాపారి జనార్దన్ రెడ్డి, అలసంద గుత్తి గ్రామానికి చెందిన జయరామి రెడ్డి, కందుకూరు గ్రామానికి చెందిన రామలింగడు, ఆటో డ్రైవర్ రామకృష్ణ నిందితులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పోలీసులు జోక్యం […]

హత్య కేసులో జీవిత ఖైదు విధించిన ఆదోని II ADJ court జడ్జి P. J. సుధా

కర్నూలు జిల్లా చిప్పగిరి మండల పరిధిలోని డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామికి జీవిత ఖైదు విధించిన ఆదోని రెండవ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు జడ్జ్ P. J. సుధా. చిప్పగిరి ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు 3/6/2021 సంవత్సరంలో డేగులపాడు గ్రామానికి చెందిన దయ్యాల వెంకటస్వామి అనే వ్యక్తి తాగుడుకు బానిసై తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను రోకలితో కొట్టి హత్య చేసినట్టు కేసు నమోదు అయిందని, నేరం రుజువు […]

చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలి వైస్ చైర్మన్ గౌస్

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పచ్చదనం పెంపొందించు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలు మేరకు డీఎస్పీ బంగ్లా రోడ్ డివైడర్ మధ్యలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంత , వైస్ చైర్మన్ గౌస్ , కౌన్సిలర్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నాగభూషణం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని వైస్ చైర్మన్ గౌస్ కోరారు.

తాగిన మత్తులో దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు బైపాస్ సమీపంలో మండగిరి పంచాయతీ చెందిన శంకర్ (40) వారి స్నేహితులతో సోమవారం సాయంత్రం మద్యం తాగి గొడవపడ్డారు ఘర్షణలో గాయపడిన శంకరును ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నలుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య తీసుకుంది. రైల్వే పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు తెల్ల వారు జామున గుర్తు తెలియని మహిళా వయస్సు సుమారు 40 సం.,లు ఆదోని యార్డ్ లోని డౌన్ లైన్ ట్రాక్ KM NO 494/16-18 వద్ద గుర్తు తెలియని రైలు/ గూడ్స్ క్రింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని తెలిపారు. మహిళ కుడి చెంప పై, యెడమ గడ్డం […]

పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి. సిపిఎం..

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కస్టమర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్చార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో దాదాపు ఏడు రకాలుగా దొడ్డిదారిన కరెంటు చార్జీలు వసూలు చేస్తుందని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకొని కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో ప్రజలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కే లింగన్న మాట్లాడుతూ ఒక్కో ఇంటికి కనీసం 200 నుండి […]

కపటి గ్రామంలో అగ్ని ప్రమాదం 3 లక్షల ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఘంధాల మోజెస్ S/o గందాల నరసన్న గుడిసె కాళీ బూడిదయింది. ఇంటి యజమాని మోజెస్ తెలిపిన వివరాల మేరకు తన భార్య ఆనందమ్మ పిల్లలకు తినుబండారాలు ఇప్పించడానికి బయట వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగిందని సుమారు 10 క్వింటాల పత్తి, 3 తులాల బంగారు,1 లక్ష రూపాయల నగదు గుడిసెలో ఉన్నాయని 3 లక్షల పైనే ఆస్తి […]

ఆదోని సేబ్ స్టేషన్లో వాహనాల వేలం

నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని సెబ్ స్టేషన్ లో 26 వాహనాలకు వేలం పాట నిర్వహించారు అందులో 25 వాహనాలను వేలం పాట పాడారు. వాహనాలకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర రూ. 4,24,000/- కాగా వేలం పాటలో రూ.6,29,000/- మరియు GST రూపంలో మరో రూ 1,13,220/- అనగా మొత్తం రూ. 7,42,220/- ఆదాయం వచ్చినది అని సెబ్ అధికారులు తెలిపారు.

ఆదోని మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి మృతి

కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. మునిసిపల్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మరియు సిబ్బంది కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 2011 నుంచి 2014 వరకు మరియు 2019 నుండి 2020 వరకు ఆదోనిలో మున్సిపల్ కమిషనర్ గా కన్యాకుమారి విధులు నిర్వహించారని తెలిపారు. ఆమె చేసిన సేవలను […]

Back To Top