కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీనివాస్ భవన్ అనే ప్రవేట్ లాడ్జిలో రూమ్ నెంబర్ 306లో ప్రేమికుల జంట అబ్బాయి పురుగుల మందు తాగి అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజు క్రితం లాడ్జి బుక్ చేసుకొని శుక్రవారం ఉదయం 11 గంటలైనా బయటికి రాకపోవడంతో హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా పలకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఇచ్చిన తెలిపిన వివరాల మేరకు అమ్మాయి చిత్తూరు జిల్లా చంద్రగిరి మానసగా గుర్తించామని. అబ్బాయి కర్నూలు జిల్లా దైవం దీన్నేకు చెందిన కురువ రాముడు అని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
రాముడు 2 నెలల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం..