ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం కర్నూలు జిల్లా ఆదోని డిపో ఏపీ పీటిడి ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ముందు 73వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వి. బ్రహ్మయ్య ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కార్మిక సమస్యల పరిష్కరించడం కోసమే ఎంప్లాయిస్ యూనియన్ పెట్టిందని నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా ఉద్యోగులకు వైద్య సౌకర్యం పని గంటల విధానం వారాంతపు ఆఫ్ అనేక సంక్షేమ పథకాలు సాధించడంతోపాటు సంస్థ మనుగడ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుండి అనేక రాయితీలు తీసుకురావడం జరిగిందని తెలిపారు. యాజమాన్యంతో మరియు ప్రభుత్వంతో నిత్యం మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చేస్తున్నామని అన్నారు.
ఈ వార్షికోత్సవానికి జిల్లా అధ్యక్షులు రంగస్వామి, సీనియర్ నాయకులు లక్ష్మన్న, జోనల్ నాయకులు పి పి రాముడు, డిపో కార్యదర్శి ఉల్లిగప్ప, గ్యారేజ్ కార్యదర్శి మెసేరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందు, సిసిఎస్ రమణమూర్తి, జిల్లా నాయకులు సుధాకర్, ట్రెజరర్ గౌడ్, నాయకులు రమేష్, ప్రసాద్, బియల్ బాబు, గ్యారేజ్ నాయకులు మరియు రన్నింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.