◆ ఆగస్టు 14వ తేదీన దేశవ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం..◆ బడా కార్పొరేటర్లకు కొమ్ముకాస్తున్న బిజెపి ప్రభుత్వం..◆ మతతత్వ విధానాల ద్వారా ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు.. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులను కూలీలను కార్మికులను విస్మరించి బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, తన మతతత్వ విధానాల ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని చీల్చి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు […]
వీధి దీపాలు వెలిగించాలని క్యాండిల్స్ తో నిరసన
ఆదోని పట్టణంలో భీమ్ రెడ్డి కాలనీలో వీధిలైట్లు వేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ భీమ్ రెడ్డి కాలనీ నందు వీధిలైట్లు వేయాలని కాలనీవాసులు సంబంధిత అధికారులకు తెలిపిన చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు చందంగా ఉందని అన్నారు. కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబందిత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు తెలిపారు. కాలనీ నందు వీధిలైట్లు వెలగకపోవడంతో […]
విద్యుత్ సరఫరాలో అంతరాయం
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం శుక్రవారం పత్రికా ప్రకటన లో తెలిపారు. విద్యుత్ మరమ్మతులు, ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో అన్ని ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ తమ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.
ఆదోనిలో గడపగడపకు మన ప్రభుత్వం
అవినీతి రహిత పాలన అమలుపరస్తు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని 30వ వార్డు వడ్డే గేరిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పాలుగోన్న. ప్రతి గడపకు తిరుగుతూ వార్డుల సమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన […]
రైతు బజార్ కూరగాయల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో కేజీ టమాట 48 రూపాయలు స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరలు.
అబివృద్ది పై సమీక్ష సమావేశం
కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం , జిల్లా పరిషత్ చైర్మన్ , స్థానిక సంస్థల MLC – Dr మదూసుధన్ , మున్సిపల్ చైర్మన్ శాంత , ఆదోని […]
వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించి అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల ఉపతహసీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమము నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు […]
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
తన మన పర భేదం లేకుండా పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చే కార్యక్రమం ఇది. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ చూడాలన్నదే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార భోజనం అని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి పర్యటించరు. బండిమెట్ట అంగన్వాడి సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. రిజిస్టర్ లో ఉన్న దానికంటే స్టాక్ ఎక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ […]
పేదల కోసం ఎప్పుడూ అండగా ఉంటాం
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికోసం ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
ఉచితంగా విత్తనాల కిట్ల పంపిణీ
కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల రూపాయల విలువ చేసే విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపిఎం చంద్రశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ రెడ్డి మార్కెట్ చైర్మన్ మజార్ అహ్మద్ మార్కెట్ వైస్ చైర్మన్ తిమ్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్ […]