News
ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి రోడ్డు లేకుండా చేశారు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్/ఆర్డీవో (ఇంచార్జ్) హెచ్ ఎన్ ఎన్ ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ లో ఆదోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని.

- ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన వీరేష్ సంబంధించి సర్వేనెంబర్ 89 నందు 4.50 ఎకరాల భూమిలో 4.50 సెంట్ల భూమిలో గత పది సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేసుకున్నాము. ప్రస్తుతం మా ఇంటి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమణ
చేసి రోడ్డు మార్గం లేకుండా చేశారు. దయతో విచారం చేసి న్యాయం చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు. - హోళ గుంద మండలం గజ్జహల్లి గ్రామంలో సర్వేనెంబర్ 354 /ఏ నందు 1.00 ఎకరా విస్తీర్ణం కొనుగోలు ద్వారా సంక్రమించినది. ప్రస్తుతం మా తండ్రి గారు చనిపోయిన తరువాత నా యొక్క పేరు మీద రిజిస్టర్ చేయడానికి వెళ్ళగా సదరు భూమి ఆన్లైన్ నందు దేవాదాయ శాఖ భూమిగా ఉన్నది దయతో విచారణ చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం నాగనాతహళ్లి గ్రామానికి చెందిన రంగయ్య సంబంధించి సర్వేనెంబర్ 583 నందు 2.05 ఎకరాల విస్తీర్ణం భూమి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదు అయినది దయతో విచారణ చేసి నా యొక్క పేరును నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం ఆరెకల్ గ్రామం అయ్యప్పకు సంబంధించి సర్వేనెంబర్ 147 నందు 2.40 ఎకరాల భూమి మా పెద్దల నుండి సంక్రమించినది. ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు నమోదు కాలేదు దయతో ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో 49 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలన్నీ గడువు లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డి.ఎస్.పి శివ నారాయణస్వామి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, డి ఎల్ పి ఓ నూర్జహాన్ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్టీవో నాగేంద్ర, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, సిడిపిఓ ఉమామహేశ్వరి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు